logo

ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం

మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్‌ నియమించిందని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు.

Published : 25 Apr 2024 02:09 IST

మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్‌ నియమించిందని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి గౌతమ్‌ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌కు బుధవారం వచ్చారని తెలిపారు. మల్కాజిగిరి జిల్లా ఎన్నికలకు సంబంధించిన  అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకులకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయొచ్చని వివరించారు. కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోని ఎఫ్‌-26లో ఈ అధికారులు ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి 12 వరకు అందుబాటులో ఉంటారని తెలపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని