ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది.
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును ఉపయోగించుకోలేరు. దీంతో భారత ఎన్నికల సంఘం పలు రకాల పద్ధతులను అవలంబిస్తోంది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, ఎన్నారైలు, గూఢచారి వ్యవస్థలో పనిచేస్తున్నవారు, వయోవృద్ధులు ఓటు ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను కల్పించింది. వాటి గురించి తెలుసుకుందాం..
ప్రాక్సీ ఓటు: సాయుధ దళాలు, గూఢచారి, ఇంటిలిజెన్స్, బోర్డర్ రోడ్స్ డెవలప్మెంట్ బోర్డు కింద పనిచేస్తున్నవారు ప్రాక్సీ ఓటును వినియోగించుకుంటారు. ఈ పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకునే సేవా ఓటరును ‘క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్’ (సీఎస్వీ)గా పేర్కొంటారు. సేవా ఓటరు తన నియోజకవర్గంలో ఓటరుగా నమోదైన వ్యక్తిని ప్రాక్సీ (ప్రతినిధి)గా నియమించుకోవచ్చు. సేవా ఓటరుకు బదులు తమ ప్రతినిధి నేరుగా ఓటు వేస్తారు. ప్రాక్సీ ఓటింగ్ తమకు సైతం వర్తింపజేయాలని ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు.
ఈడీసీ ద్వారా
తమ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అదే కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అలాంటి వారు ఈడీసీ (ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్) తీసుకొని తాము విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయవచ్చు.
సర్వీసు ఓటు
ఆర్మీ, నౌకా దళం, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ మొదలైన సాయుధ బలగాల్లో పనిచేసేవారు, రాష్ట్రం వెలుపల విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్ర సాయుధ పోలీసు దళ సభ్యులను, వారితోపాటు నివసించే తమ భార్య లేదా భర్తను సర్వీసు ఓటర్లుగా గుర్తిస్తారు. వీరు ముందుగా తమ స్వస్థలంలోని ఓటరు జాబితాలో సర్వీసు ఓటర్లుగా నమోదు చేయించుకోవాలి. అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారి పంపించిన పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటును వినియోగించుకుంటారు.
ఎన్నారైలు ఇలా
భారతీయ పౌరసత్వం ఉండి విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే ఉంటున్నవారు ఉన్నారు. అలాంటి వారు ఫారం- 6ఏ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పాస్పోర్టు సైజు ఫొటో, వీసా, పాస్పోర్టు నకలు తదితర ధ్రువపత్రాలను సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. అనంతరం పోలింగ్ రోజు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్
ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగులు తమ నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
టెండర్ ఓటు: ఎన్నికల రోజు వరకు ఓటరు జాబితాలో పేరు ఉండి, పోలింగ్ కేంద్రం వద్ద గల్లంతు కావడం, తమ ఓటును వేరే వారు వేయడం లాంటి పరిస్థితుల్లో వారికి టెండర్ ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు. ఓటరు అంతకు ముందు ఓటేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
సాధారణ ఓటు
భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీన్ని సాధారణ ఓటు అంటారు. ఇలా నమోదు చేసుకున్నవారు పోలింగ్ రోజు సంబంధిత బూత్లో ఓటు వేస్తారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు: మంత్రి తుమ్మల
[ 17-05-2024]
తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
[ 17-05-2024]
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
వేడి నీటివల్లే బొబ్బలు.. యాసిడ్దాడి తప్పుడు ప్రచారమే: వీసీ గణేశ్
[ 17-05-2024]
నగరశివారు మోకిలలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వీసీ గణేశ్ తెలిపారు. -
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
[ 17-05-2024]
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి