ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు.
బోరబండ శ్రీరామ్నగర్కాలనీలో ప్రసంగిస్తున్న కేటీఆర్
బోరబండ, న్యూస్టుడే: అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి టి.పద్మారావు తరఫున రహ్మత్నగర్ డివిజన్ శ్రీరామ్నగర్ కూడలిలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్కసీటు రాలేదని, లోక్సభ ఎన్నికల్లోనూ అలాగే చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారని, ఈసారి అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ చెప్పినట్లు అచ్ఛేదిన్ రాలేదని, సచ్చేదిన్ మాత్రం వచ్చాయని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో భారాసకు పది నుంచి 12 సీట్లు ఇస్తే ఒక సంవత్సరం లోపు కేసీఆర్ శకం మరోసారి ప్రారంభమవుతుందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రాహుల్ బాటలో నడుస్తున్నారా లేక మోదీ బాటలో నడుస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని రాహుల్ అంటే ‘నహీ నహీ బడే భాయ్ హై’ అంటూ రేవంత్ అంటున్నారని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి భారాస ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత దానం భాజపాలో చేరరని నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం మాట అటుంచి, వచ్చినవి వెళ్లిపోతున్నాయన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని తాము ప్రయత్నిస్తే, విషనగరంగా మార్చేందుకు భాజపా నాయకులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నగరానికి ఒక్క నయాపైసా పని చేయలేదని దుయ్యబట్టారు. ‘భాజపా అక్కరకు రాని చుట్టం’ అని ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లే లోక్సభ ఎన్నికల్లో పద్మారావునూ ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలో ఉన్న మసీదు నుంచి అజాన్ వినపడటంతో అది ముగిసే వరకు ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. భారాస సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి టి.పద్మారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి మోదీ కుట్ర
మూసాపేట, న్యూస్టుడే: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మూసాపేటలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం తనకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్రెడ్డి ‘చిల్లర మాటలు.. ఉద్దెర పనులు’ అన్నట్లుగా పాలన ఉందన్నారు. కొత్త పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు తరలిపోయే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు. ఎన్నికలకు ముందు తాము మైసూర్ నుంచి తీసుకొచ్చిన పరిశ్రమ సీఎం అసమర్థతతో గుజరాత్కు తరలిపోయిందన్నారు. రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ కోతలు అమలవుతున్నాయని, ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకునే వారు కరవయ్యారని, తమ హయాంలో పేదలకు 25 వేల లీటర్ల ఉచితంగా తాగునీటిని ఇస్తే, ఇప్పుడు రూ.2 వేలు చెల్లిస్తే 24 గంటలలోపు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తానని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన సాయం ఏమి లేదన్నారు. ఆయనకు తెలిసిందల్లా హిందూ ముస్లిం మధ్య తగదాలు పెట్టి ఓట్లు దండుకుంటారన్నారు. యాదాద్రిలో కేసీఆర్ అఖండమైన తరహాలో నర్సింహస్వామి ఆలయం కట్టినా ఏనాడు రాజకీయ ప్రయోజనాలకు వాడలేదన్నారు. మోదీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కె.నవీన్కుమార్, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస