logo

క్రషర్ క్వారీలో పడి మరో యువకుడు బలి

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో పడి గౌతమ్ (21)మృతి చెందాడు.

Published : 04 May 2024 17:23 IST

కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో పడి గౌతమ్ (21)మృతి చెందాడు. ఓ కంపెనీలో సేల్స్ మ్యాన్‌గా పని చేస్తున్న గౌతమ్‌ వీకెండ్ సందర్భంగా తన స్నేహితులతో కలిసి అంకిరెడ్డిపల్లి గ్రామంలోని మహాలక్ష్మి క్రషర్ క్వారీలో ఈతకు వచ్చాడు. సరదా కాస్త ప్రాణం తీసింది. గౌతం ఫొటోలు దిగుతూ క్రషర్ క్వారీలోని నీటిలో పడిపోయాడు. లోతైన గుంతలు ఉండటంతో నీట మునిగి మృతి చెందాడు. గౌతమ్ స్వస్థలం సైనిక్ పురి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని