కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మక్బూల్ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.
రాజేంద్రనగర్, న్యూస్టుడే: అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మక్బూల్ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతుడి బంధువులు, స్థానికులు ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశాలున్నాయని భావించి పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చేపట్టారు. హంతకుడిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు అమ్జద్, హత్యకు గురైన మక్భూల్తో సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఇద్దరు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ ఎన్నికల సమయంలోనే అమ్జద్ ఎంఐఎం పార్టీలో చేరినట్లు సమాచారం. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది. ఇటీవల వీరి మధ్య బస్తీలో ఆధిపత్య పోరు నడిచిందని, ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా మక్బూల్పై అమ్జద్ కోపం పెంచుకున్నట్లు సమాచారం. దీంతో శనివారం రాత్రి కాంగ్రెస్ సమావేశానికి మక్బూల్ ఏర్పాట్లు చేస్తుండగా అమ్జద్ అతడిపై దాడిచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.కోటి వజ్రాభరణాలు మాయం
[ 18-05-2024]
శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు క్యాబ్లో ఓ వృద్ధురాలు బయల్దేరగా ఆమెకు సంబంధించిన రూ.కోటి విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. వాటిని క్యాబ్ డ్రైవరే తస్కరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. -
చిరునామాల్లో ఉండరు.. దేనికీ స్పందించరు
[ 18-05-2024]
సేవాలోపాలకు పాల్పడుతున్న సంస్థల చిరునామాలపై స్పష్టత కొరవడటంతో లీగల్ నోటీసులు ఎక్కడికి పంపాలన్న ప్రశ్నలు ఫిర్యాదుదారుల్లో తలెత్తుతున్నాయి. జిల్లా వినియోగదారుల కమిషన్లకు ఫిర్యాదులు చేసినా అవి విచారణ వరకు వెళ్లడం లేదు. -
యువతే దేశానికి సంపద
[ 18-05-2024]
యువతే దేశానికి సంపద అని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ అరుణ్కుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విభాగం పట్టభద్రుల దినోత్సవం నిర్వహించారు. -
కొలనుపాక జైన దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్
[ 18-05-2024]
కొలనుపాకలోని జైన శ్వేతాంబర తీర్థం దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్ బాటియా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 30 ఏళ్గుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా, కొన్ని సంవత్సరాలు సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పనిచేశారు. -
కేఏ పాల్పై చీటింగ్ కేసు
[ 18-05-2024]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీకి పార్టీ టికెట్ ఇస్తానని పాల్ రూ.57 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన ఎస్.కిరణ్కుమార్ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. -
సెల్ఫీ దిగుతూ భవనం పైనుంచి పడిన బాలుడు
[ 18-05-2024]
సెల్ఫీ దిగుతూ బాలుడు మూడంతస్తుల భవనం పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడిన ఘటన పాతబస్తీ ఉప్పుగూడ క్రాంతినగర్లో శుక్రవారం జరిగింది. -
‘ఫ్యాషన్ వీక్’ను నిలిపేసిన పోలీసులు
[ 18-05-2024]
ఈనెల 17 నుంచి 19 వరకు లులు మాల్లో కొనసాగాల్సిన ఫ్యాషన్ వీక్ కార్యక్రమాన్ని కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం నిలిపేశారు. -
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
[ 18-05-2024]
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
[ 18-05-2024]
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?