icon icon icon
icon icon icon

Kishanreddy: రిజర్వేషన్‌లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారు: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ చేస్తోన్న రిజర్వేషన్‌ రద్దు ప్రచారం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 19:39 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ చేస్తోన్న రిజర్వేషన్‌ రద్దు ప్రచారం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్‌లపై కాంగ్రెస్‌ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్‌ లబ్ధిదారులే భాజపాపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు భాజపా గెలవబోతోందన్నారు. విపక్షాలు చేస్తోన్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది బాధ్యతారాహిత్యమైన విమర్శగా పేర్కొన్నారు.

సీఎం ప్రసంగాల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్వయంగా.. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులను జైల్లో వేస్తే బుద్ధి వస్తుందన్న రేవంత్ రెడ్డి ప్రకటనలు ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. భాజపా చేపట్టిన ఊరూరా ప్రచారానికి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img