4 సార్లు.. 4 నియోజకవర్గాలు
శాసనసభకు వరుసగా ఎన్నికయ్యే నాయకులు కొందరే ఉంటారు. వారు కూడా ఏదో ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతారు.
శాసనసభకు వరుసగా ఎన్నికయ్యే నాయకులు కొందరే ఉంటారు. వారు కూడా ఏదో ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతారు. అయితే రాష్ట్రంలో 1952 నుంచి 1967 వరకు వరుసగా నాలుగు సార్లు వేర్వేరు స్థానాల నుంచి ఎన్నికైన నేత ఒకరే ఉన్నారు. ఆయనే బుట్టి రాజారాం. నల్గొండ జిల్లాకు చెందిన రాజారాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. కరీంనగర్లో ఆయన పేరిట ఓ కాలనీయే ఉండటం విశేషం. కొన్నాళ్లు కరీంనగర్లో నివసించిన రాజారాం అనంతరం బెల్లంపల్లిలో స్థిరపడ్డారు. 1952లో జగిత్యాల ద్విసభ నుంచి ఎస్సీఎఫ్ అభ్యర్థిగా 30 శాతం ఓట్లు సాధించి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1957 ఎన్నికల్లో సుల్తానాబాద్ ద్విసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 31 శాతం ఓట్లతో గెలిచారు. 1962 ఎన్నికల్లో పెద్దపల్లి(ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరఫున 75.66 శాతం ఓట్లు పొందారు. 1967లో నుస్తులాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 46.92 శాతం ఓట్లతో విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
న్యూస్టుడే, పెద్దపల్లి
నిలువెత్తు అభిమానం
మెట్పల్లి పట్టణంలో సోమవారం భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు యువకులు ప్రధాని మోదీ, అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కటౌట్లు పట్టుకొని సభా ప్రాంగణానికి రావడం ఆకట్టుకుంది.
చిత్రం: న్యూస్టుడే, జగిత్యాల
మీ భుజాలపైనే.. నా గెలుపు బాధ్యత
ధర్మపురి భారాస అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం వెల్గటూరు మండలం కప్పారావుపేట, శాఖాపూర్, వెంకటాపూర్, స్తంభంపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయన నృత్యం చేశారు. అనంతరం వారు మంత్రిని ఎత్తుకొని సందడి చేశారు.
న్యూస్టుడే, వెల్గటూరు
పార్టీ ఏదైనా ఆ శాఖ..ఉమ్మడి జిల్లాకే..
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పౌరసరఫరాల శాఖ మంత్రి పదవి ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులనే వరించడం ఆనవాయితీగా వస్తోంది. 2014కు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2020 వరకు మంత్రివర్గంలో ఈటల రాజేందర్ (ప్రస్తుత హుజూరాబాద్ ఎమ్మెల్యే) ఆ శాఖను పర్యవేక్షించారు. 2020 నుంచి ఇప్పటివరకు కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్గానూ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయపరంగా కీలకమైన జిల్లాలో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో సూర్యాపేట తర్వాత ఇక్కడే ఎక్కువగా బియ్యం మిల్లులుండటం విశేషం.
ఈనాడు, పెద్దపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత!
[ 22-05-2024]
పత్తి విత్తనాల కృత్రిమ కొరత కర్షకులను ఆగం చేస్తోంది.. వ్యాపారుల ఇష్టారాజ్యం రైతుల జేబుకు చిల్లు పెడుతోంది.. సాధారణ ధరలకు పత్తి విత్తనాలు లభించే పరిస్థితే కనిపించడం లేదు. -
ఇంటర్ ప్రవేశాలకు వేళాయె
[ 22-05-2024]
వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. -
వలస జీవులకు రైతన్న అండ!
[ 22-05-2024]
ఒకప్పటి కరవు నేల సాగునీటి ప్రాజెక్టులతో కోనసీమగా మారింది. తెలంగాణకే ధాన్యాగారంగా మారిన జిల్లాలో వరిధాన్యం సిరులు కురిపిస్తోంది. -
మళ్లీ.. ఇన్ఛార్జి వీసీ
[ 22-05-2024]
శాతవాహన విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి వీసీ (వైస్ ఛాన్స్లర్)గా సురేంద్ర మోహన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో మరోమారు ఇన్ఛార్జి పర్యవేక్షణ కొనసాగనుంది. -
చెరువు మట్టి.. చేనుకు పుష్టి
[ 22-05-2024]
జిల్లాలో రైతులు చెరువుల్లో పూడికమట్టిని తోటలు, పొలాలకు పెద్దఎత్తున తరలిస్తున్నారు. -
వైభవంగా నారసింహుడి జయంతి ఉత్సవాలు
[ 22-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి స్తంభోద్భవ సమయంలో శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. -
విడుదలకు ఉత్తర్వులు... అందని ప్రోత్సాహకాలు
[ 22-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వసతులను మెరుగుపరుస్తూ ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఎన్క్వాస్(నేషనల్ క్వాలిటీ అష్యూరెన్సు స్టాండర్డ్స్) పోటీలను 2013 నుంచి నిర్వహిస్తోంది. -
రైతుల కల నెరవేరేదెన్నడో..?
[ 22-05-2024]
మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొట్టపుబావులు, బావులే వ్యవసాయానికి ప్రధాన ఆధారం. సాగునీటి కొరత నెలకొనడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం. -
ఏళ్ల తరబడి అపరిష్కృతం
[ 22-05-2024]
ఎన్నికల ప్రచారంలో నాయకులు రాష్ట్ర, జాతీయ సమస్యలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థానిక అవసరాలు తీరడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి. -
మానేరులో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ కొరడా!
[ 22-05-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నది పరీవాహక ప్రాంతాల్లో పర్యావరణ అనుమతి (ఈసీ) లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రెబ్యునల్ (ఎన్జీటీ) కొరడా ఝళిపించింది. -
100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
[ 22-05-2024]
2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి సంచాలకులు వెల్లడించారు. -
దోస్త్ యాప్తో దరఖాస్తు సులభతరం
[ 22-05-2024]
డిగ్రీ ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’(దోస్త్) విధానాన్ని పాటిస్తున్న విషయం విదితమే. దోస్త్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
మట్టి పెళ్లలు పడి ఉపాధి కూలీ మృతి
[ 22-05-2024]
కుటుంబ పోషణకోసం ఉపాధి పనులకు వెళ్లిన కూలీలను దురదృష్టం వెంటాడింది. పని చేస్తున్న ప్రదేశంలో సేదతీరుతున్న తరుణంలో మట్టి పెళ్లలు కూలీల మీద పడటంతో ఒకరు మృతిచెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. -
రైతుల బిడ్డలు.. ప్రథమ ర్యాంకులు
[ 22-05-2024]
శంకరపట్నం మండలం కరీంపేట్కు చెందిన విద్యార్థిని మేడిశెట్టి నవ్యశ్రీ సోమవారం వెలువరించిన ఈసెట్ ఫలితాల్లో సత్తా చాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్లో పూర్తి నిడివి సినిమాలు
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు