దశదిన కర్మకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
దశదిన కర్మకు వెళ్లి వస్తుండగా ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరిన ఘటన శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.
గోనెల సుదర్శన్
శంకరపట్నం, న్యూస్టుడే: దశదిన కర్మకు వెళ్లి వస్తుండగా ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరిన ఘటన శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకొంది. ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. సైదాపూర్ మండలం అమ్మనగుర్తికి చెందిన గోనెల సుదర్శన్ (68) ముగ్గురు కుమారులతో కలిసి ఆదివారం మానకొండూర్ మండలం కొండపల్కలలోని బంధువు దశదిన కర్మకు వెళ్లారు. ఆరోజు సాయంత్రమే సుదర్శన్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున సుదర్శన్ మనవరాలు శ్రీవర్షిణితో కలిసి.. బంధువైన హుజూరాబాద్ మండలం రాంపూర్కు చెందిన ముద్రవేణి ప్రభాకర్ కారులో బయలుదేరారు. కేశవపట్నం శివారు చేరుకోగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ముగ్గురికీ గాయాలవడంతో 108 వాహనంలో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సుదర్శన్ మృతిచెందారు. ప్రభాకర్, శ్రీవర్షిణి చికిత్స పొందుతున్నారు. సుదర్శన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!