అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
లోక్సభ స్థానం పరిధిలో 2 అంతర్రాష్ట్ర, జిల్లాల సరిహద్దులో 15 చెక్పోస్టులు
సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్పోస్టులో తనిఖీ చేస్తున్న అధికారులు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారా? లేదా పరిశీలించేందుకు కలెక్టరేట్లో మానిటరింగ్ వ్యవస్థకు సీసీ కెమెరాలు అనుసంధానించారు. రిటర్నింగ్ అధికారులు తమ చరవాణుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలను పరిశీలిస్తున్నారు. నామినేషన్లు స్వీకరిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
తనిఖీ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే..
లోక్సభ పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అర్జునగుట్టలో అంతర్రాష్ట్ర, చెన్నూర్లో అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీ, బెల్లంపల్లిలో రేపల్లివాడ, సోమగూడెం, పోచమ్మ గుడి, మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం, తాళ్లపేట, ఇందారం, ధర్మపురి నియోజకవర్గంలో రాయపట్నం గోదావరి వంతెన, మంథని నియోజకవర్గంలో వెక్లాస్పూర్, మేడిపల్లి, పెద్దపల్లిలో గుంపుల వంతెన, దుబ్బపల్లి, రామగుండం నియోజకవర్గంలో గోదావరి వంతెన, బసంత్నగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతాల్లో జిల్లా సరిహద్దు తనిఖీ కేంద్రాలు నెలకొల్పారు. పోలీసులు, ఆబ్కారీ, ఇతర శాఖల సిబ్బంది వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం, డబ్బు పంపకాలు, తాయిలాలు నియంత్రించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందుబాటులోని సాంకేతికత అందిపుచ్చుకుని నిఘా పెంచుతున్నారు. పోలీసుల పహారాలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులోని చెక్పోస్టుల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో చెక్పోస్టుల వద్ద వీడియో చిత్రీకరణలో వాహనాల తనిఖీలు చేసేది. అప్పుడప్పుడు జిల్లా ఉన్నతాధికారులు వీడియో చిత్రీకరణ దృశ్యాలను తనిఖీ చేసేవారు. ప్రస్తుతం వాహనాల తనిఖీల్లో పారదర్శకత కోసం మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారు. చెక్ పోస్టుల్లోని ఇరువైపులా బిగించిన సీసీ కెమెరాలు మానిటరింగ్ వ్యవస్థకు అనుసంధానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకులు చర్చకు రావాలి
[ 02-05-2024]
అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నాయకులు ఆధారాలతో సహా చర్చకు రావాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రోహిత్రావు డిమాండ్ చేశారు. -
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 02-05-2024]
ఓ యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్కు చెందిన బెత్తపు -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
[ 02-05-2024]
నిత్యం ప్రజల మధ్య ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
హస్తాన్ని నమ్మొద్దు.. కమలం మాయలో పడొద్దు
[ 02-05-2024]
కాంగ్రెస్ను నమ్మొద్దని, భాజపా మాయలో పడొద్దని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. -
ఆ పార్టీలకు డిపాజిట్లు రావు
[ 02-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, భారాసలకు డిపాజిట్లు కూడా రావని, రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
నేటి కేసీఆర్ బస్సు యాత్ర రద్దు
[ 02-05-2024]
భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సు యాత్రపై ప్రభావం పడింది. -
సమష్టి కృషితో స్వయం ప్రతిపత్తి
[ 02-05-2024]
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది. ప్రస్తుతం కరీంనగర్లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు మాత్రమే ఆ హోదా ఉంది. -
కార్మిక క్షేత్రం.. తీర్పు విలక్షణం
[ 02-05-2024]
కార్మిక క్షేత్రమైన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం.. ఆది నుంచి ప్రజా తీర్పులో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడి ఓటర్లు ప్రతి పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారమిస్తూ, తర్వాత కొత్త వారికి అవకాశమిస్తున్నారు. -
కీలక సంస్కరణల వెనుక..
[ 02-05-2024]
‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ కేసుకు సంబంధించి 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛలో ‘నోటా’ భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
పురపాలికలకు ముందస్తుగా కాసుల జమ
[ 02-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తుగానే కాసుల గలగల కనిపించింది. గత నెల 1 నుంచి 30 వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు అయిదు శాతం రాయితీ ఇచ్చారు. -
మామ చేతిలో కోడలి హతం
[ 02-05-2024]
కుటుంబ పరువు కోసం కోడలి గొంతుకోసి మామ హత్య చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని కొత్తపల్లి తండాలో బుధవారం చోటుచేసుకుంది. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. పోలింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. -
ఓటుకు.. తప్పని దూరాభారం
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నా.. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో తండావాసులకు ఇబ్బందిగా మారుతోంది.. -
కాంగ్రెస్కు భయపడే మోదీని తీసుకొస్తున్నారు
[ 02-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎదుర్కోవడానికి -
ఇరవై శాఖలతో.. అభ్యర్థుల ప్రచారంపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాలకు పదునుపెడుతున్నారు. -
భానుడి ప్రతాపం.. కార్మికుల బేజారు
[ 02-05-2024]
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తకి విఘాతం ఏర్పడుతోంది. -
మేమే వస్తాం.. ఓటు అభ్యర్థిస్తాం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకోవడంతో అంతటా రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఎండ 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో ఉదయం 9 గంటలకే గడప దాటలేనంతగా మండుతోంది. -
అయిదేళ్లు.. పెరిగిన ఓటర్లు 41,930
[ 02-05-2024]
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,66,836 మంది ఓటర్లు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా