logo

సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ దుయ్యబట్టారు.

Published : 09 May 2024 04:50 IST

భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

ఎలిగేడు (సుల్తానాబాద్‌),  జూలపల్లి, న్యూస్‌టుడే: అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ దుయ్యబట్టారు. సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో బుధవారం మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్‌ వచ్చి కరవు తెచ్చిందని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతున్న క్రమంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, గ్రంథాలయ మాజీ ఛైౖర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, ఎంపీపీ రమాదేవి పాల్గొన్నారు.

అసంతృప్తిలో మండల నాయకులు

ఎలిగేడు మండలంలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి తమకు సమాచారం లేదని మాజీ ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి, దుర్గయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ విజయ భాస్కర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు మహేందర్‌, కొండల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని