భానుడి భగభగ.. కావొద్దు ఓటుకు సెగ
ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు.
నాలుగు చోట్ల 2 గంటల ముందే పోలింగ్ ముగింపు
పూర్తి స్థాయి వసతుల ఏర్పాటుతో ఓటింగ్ శాతం పెంపు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. నడి వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్గా మారింది. తీవ్రవాద ప్రాబల్య ప్రాంతమైన పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా నాలుగు చోట్ల సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. దీంతో ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులు టెంట్లు, తాగునీటి వసతి కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
ఆ సెగ్మెంట్లలో 4 గం.ల వరకే..
పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. గత ఎన్నికల్లో చెన్నూరులో 70.23 శాతం, బెల్లంపల్లిలో 69.81, మంచిర్యాలలో 59.39, ధర్మపురిలో 69.11, రామగుండంలో 55.31, మంథనిలో 69.02, పెద్దపల్లిలో 69.73 శాతం చొప్పున లోక్సభ పరిధిలో మొత్తం 65.43 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. అయిదేళ్లలో 6.27 శాతం పోలింగ్ తగ్గింది. 2019 ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పాటు సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ సమయం ఉండటంతో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
వసతులు సమకూరిస్తే మేలు
- ఎండల ప్రభావం పోలింగ్పై పడనుంది. ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- పోలింగ్ కేంద్రాల ముందు నామమాత్రంగా టెంట్ వేస్తున్నారు. చెట్లున్న ప్రాంతాల్లో అది కూడా కనిపించడం లేదు. ఎక్కువ ప్రాంతం నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
- విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్ అందుబాటులో ఉంచాలి. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా టెంట్లు, చలువ పందిళ్లు వేయాలి.
- చేతిపంపుల నీరు కాకుండా ఓటర్లకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించాలి. వడదెబ్బకు గురైతే ప్రథమ చికిత్స కోసం మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
- 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. వీరికి ప్రత్యేక వసతులు కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!