సభాపర్వానికి సన్నద్ధం
కొత్త ఏడాదిలో సర్కారు విధానసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ను ఆహ్వానించనున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి
ఫిబ్రవరి 14న షురూ.. 25న ముగింపు
మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశం
ఈనాడు డిజిటల్, బెంగళూరు : కొత్త ఏడాదిలో సర్కారు విధానసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ను ఆహ్వానించనున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి ఈ సమావేశం తర్వాత ప్రకటించారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు కూడా సర్కారు సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తదుపరి మంత్రివర్గ సమావేశం తర్వాత చర్చిస్తామన్నారు. బీబీఎంపీ, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలు, విద్యా వికాస తదితర కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలిలా..
ఎన్నికలకు సిద్ధం
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. బీబీఎంపీ ఎన్నికల కోసం నగర మంత్రులు, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మంత్రులంతా సమన్వయంగా పని చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన విధానసభ, పరిషత్తు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమన్వయం కొరవడినట్లు వస్తున్న ఆరోపణలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎమ్మెల్యేలకు అప్పగించాల్సిన బాధ్యతలపై మంత్రులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఆరు నెలలుగా శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రత్యేక కరదీపికలను ముద్రించనున్నారు. త్వరలో నందిబెట్టలో నిర్వహించే పార్టీ చింతనా సమావేశంలో శాఖల ప్రగతిపై సమీక్షిస్తారు.
కరోనా నియంత్రణ వ్యవస్థ, పాఠశాలల నిర్వహణపై మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. మరోమారు నిపుణుల సమితితో చర్చించి నిబంధనల సడలింపుపై తీర్మానిస్తారు. వలయాల వారీగా చేపట్టిన సమీక్షలు, తాజా కేసులు, మరణాల ప్రమాణాలపై సమీక్షలు నిర్వహిస్తారు.
మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విస్తరణ, పార్టీ ఫిరాయింపులపై బహిరంగ వ్యాఖ్యలు తగదని మంత్రులకు సూచించారు.
2021-22 ఏడాది విద్యా వికాస కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.93.27 కోట్లలతో ఉచిత సమవస్త్రాలు పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని వివిధ కారాగృహాల్లో శిక్ష అనుభవిస్తున్న 166 మంది ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా విడుదల భాగ్యం..
కర్ణాటక అటవీ అభివృద్ధి, అటవీ పారిశ్రామిక ఉత్పాదన సంస్థల విలీనం..
రామనగర, చెన్నపట్టణ ప్రభుత్వ పట్టు శిక్షణ సంస్థల ఆవరణలలో నాబార్డ్ సహకారంతో రూ.75కోట్ల వ్యయంతో హైటెక్ పట్టు గూళ్ల మార్కెట్ల స్థాపన..
కళ్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి నిధులతో కలబురగిలోని సేడం జాతీయ రహదారిలో రూ.49 కోట్ల వ్యయంతో పై వంతెన, రహదారి విస్తరణ పనులకు పాలనామోదం.
చాముండి దేవస్థాన భక్తుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.92.81కోట్ల నిధులు..
బెంగళూరు దక్షిణ తాలూకా బేగూరు హొబళ్లిలో 4.19 ఎకరాల భూమిని రాష్ట్ర గూఢాచారి వ్యవస్థ శిక్షణ అకాడమి స్థాపనకు ఆమోదం.
వసతి వితరణ పథకాల్లో హక్కు పత్రాల పరిశీలన, వ్యవసాయ భూముల దస్త్రాలు, పట్టణ, నగర ఆస్తుల పత్రాల సమాచారం సిద్ధం చేసేందుకు అర్హులైన ప్రైవేటు ఏజెన్సీలతో సమీక్ష.. ఇందుకు రూ.287 కోట్ల నిధులకు ఆమోదం..
400 మంది పశువైద్యుల నియామకాలకు అనుమతి..
వర్తూరు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.488 కోట్ల కేటాయింపు.
చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలో అమలులో ఉన్న 131 గ్రామాల బహుగ్రామ తాగునీటి పథకాన్ని జిల్లాలోని మరో 32 గ్రామాలకు విస్తరించేందుకు రూ.22 కోట్ల మంజూరు.
చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలో 300 జనవసతి తాగునీటి వ్యవస్థల కోసం రూ.392 కోట్ల కేటాయింపు.
అమృత మహోత్సవాల పథకాల్లో భాగంగా రాష్ట్రస్థాయి అమలు సమితి ఏర్పాటు.
మంగళూరు నగరాభివృద్ధి పరిధిలో 45.85 ఎకరాల భూమిలో సర్కారు లేఅవుట్ల కోసం రూ.30.50 కోట్లు విడుదల.
హుబ్బళ్లి ధార్వాడ పాలికె పరిధిలో ఆర్యభట్ట ఐటీ పార్కులో మిగులు మూడు ఎకరాల భూమిని మూడు ఐటీ, బీటీ కంపెనీలకు వితరణ.
యాదగిరి జిల్లా గురుమిఠ్కల్ క్షేత్రంలోని భీమా నది పరివాహక ప్రాంతంలో 20 చెరువుల పునరుద్ధరణకు రూ.165 కోట్ల విడుదలకు నిర్ణయం.
బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా పరిధిలో కృష్ణా నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ పునరుద్దరణకు రూ.35 కోట్ల కేటాయింపు కోసం డీపీఆర్ ఆమోదం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిషత్తు పోరులోనూ కాసుల మాటే !
[ 19-05-2024]
విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్ చెంతకు చేరుతాయి. -
ప్రజ్వల్ తప్పించుకోలేడు
[ 19-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. -
ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!
[ 19-05-2024]
ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. -
ప్రధాని వ్యాఖ్యలు షాకిచ్చాయి
[ 19-05-2024]
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘డీకేపై అర్థరహిత ఆరోపణలు’
[ 19-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పెన్డ్రైవ్ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ -
ఆటవిడుపు
[ 19-05-2024]
నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు. -
‘ఐస్క్రీమ్ మ్యాన్’ ఇకలేరు
[ 19-05-2024]
ఐస్క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్క్రీమ్ మ్యాన్’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్ కామత్ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
[ 19-05-2024]
ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన