దారి తప్పిన పాలన
ఉద్యాననగరి రహదారుల నిర్వహణ గాడితప్పింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు, ఇంజినీర్లు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి నివేదిక ఇవ్వకపోతే విధుల
అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నెలమంగల పరిధిలోని ఒక రహదారి దయనీయ స్థితి
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: ఉద్యాననగరి రహదారుల నిర్వహణ గాడితప్పింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు, ఇంజినీర్లు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి నివేదిక ఇవ్వకపోతే విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామంటూ హెచ్చరించింది. అవసరమైతే సైన్యాన్ని రప్పించి వారంలోనే రహదారుల మరమ్మతు పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇస్తామని తేల్చిచెప్పింది. నగరంలో రహదారులన్నీ మరమ్మతులు చేయాలని విజయ్ మెనన్ ఏడేళ్ల కిందట ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మరమ్మతులు చేస్తున్నామని, ఈ ప్రక్రియ కొనసాగుతోందంటూ పాలికె తరఫు న్యాయవాదులు నివేదికలు ఇస్తూ వస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతి, విదేశీ ప్రముఖులు వస్తేనే రహదారులు బాగు చేస్తారా అంటూ ఇంజినీర్లను గత వారం న్యాయస్థానం తూర్పారబట్టింది. గుంతలు పూడ్చడంలో పాలికె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ శంకర్ మగదుమ్ నేతృత్వంలోని పీఠం ధ్వజమెత్తింది. రహదారుల మరమ్మతు, నిర్వహణకు ముందుకు వచ్చిన అమెరికన్ రోడ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్కు పాలికె సరైన విధంగా సహకారాన్ని ఇవ్వడం లేదని న్యాయమూర్తులు ప్రస్తావించారు. గోతులు పూడ్చకపోతే పాలికెలో ప్రధాన కమిషనర్, ఇంజినీర్లు, సిబ్బందిని విధుల నుంచి తప్పించేలా ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. రహదారుల మరమ్మతును త్వరగా పూర్తి చేసేలా ఇచ్చిన ఆదేశాలను తమకు దాఖలు చేయాలని ఆదేశించారు. నగరంలో 2,533 గుంతలను పూడ్చవలసి ఉందని అర్జీదారుని తరఫు న్యాయవాది ఎస్.ఆర్.అనూరాధ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. పైథాన్ యంత్రాన్ని ఉపయోగించి గుంతలను పూడ్చేందుకు ప్రతి చ.మీ.కు రూ.598కు ఒప్పందం కుదిరిందని, దీనిపై అధికారిక ఆదేశాలు వెలువరించవలసి ఉందని పాలికె పక్ష న్యాయవాది శ్రీనిధి కోర్టుకు విన్నవించారు.
* ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం బెంగళూరు. ఆసియా ఖండంలో ఎక్కువ వాహనాలు ఉన్న నగరమూ ఇదే. నగరంలో నిత్యం పది ప్రమాదాలు సంభవిస్తుండగా, అందులో సగటున ఇద్దరు మరణిస్తున్నారు. మరో నలుగురు గాయపడుతున్నారు. ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే కొత్తగా రహదారి వేసిన తర్వాత కొద్ది రోజులకే దాన్ని తవ్వుతున్నారు. గుంతలను సరిగా పూడ్చకపోవడంతో అవి మృత్యుకూపాలుగా మారిపోతున్నాయి. వాహన రద్దీతోనే పలు సంస్థలు వెనక్కు వెళుతున్నాయని ఐటీ, బీటీ సంస్థల యజమానులు పలుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. మెట్రోలు, ఉపరితల వంతెనల నిర్మాణాలను చేపడుతున్నా, సమస్య ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఉపరితల వంతెనల మార్గంలోని కూడళ్లలో బిలమార్గాలను ఏర్పాటు చేయాలని గతంలో పాలికెకు సలహాదారుగా వ్యవహరించిన రాజసింహ చేసిన సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపించారు. ప్రభుత్వం, పాలికె వైఫల్యాలను నిరసిస్తూ స్థానిక నివాసులు, కళాకారులు, వివిధ పార్టీల నేతలు క్రమం తప్పకుండా నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చినా, పాలకుల్లో స్పందన కరవైంది.
బ్యారికేడ్ చూసుకోకుండా వస్తే ప్రమాదమేనండోయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?