logo

ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రధాని అభినందన

కొత్త దిల్లీలో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో  కొడగు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న కర్ణాటక - గోవా ఎన్‌సీసీ క్యాడెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

Published : 17 Aug 2022 02:47 IST

కొడగు సంప్రదాయ దుస్తుల్లో కర్ణాటక - గోవా ఎన్‌సీసీ క్యాడెట్లు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : కొత్త దిల్లీలో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో  కొడగు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న కర్ణాటక - గోవా ఎన్‌సీసీ క్యాడెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రానికి చెందిన సుభాషిణి, శ్రీశెట్టి, శశిధర్‌, కృత్తిక, మేనక, చింతన, దీక్షిత్‌, తేజశ్విని, ప్రీతి, పూర్ణిమ, కిరణ్‌, విజయ్‌, పవన్‌, మల్లికార్జున, గోవా రాష్ట్రానికి చెందిన, చందన్‌, సోనం, సయ్యాల్‌ ఫెర్నాండిజ్‌, ఆదిత్య జ్యోషి తదితర ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. పరేడ్‌ తర్వాత క్యాడెట్లు ఉన్న దగ్గరికి ప్రధాని నరేంద్రమోదీ విచ్చేసి అభినందించారు. వీరికి బెంగళూరు, కొత్త దిల్లీలోనూ సుమారు నెల రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని