ఫలితం తారుమారు.. సౌమ్యా కన్నీరు
చేతికి వచ్చింది నోటికి అందేలోగా నేలపాలైనట్లుంది సౌమ్యారెడ్డి పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ గాలి వీచిన సమయంలో బెంగళూరు నగర పరిధి జయనగర నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేసిన ఈ యువనాయకురాలు విజయం సాధించినవని అంతా భావించారు.
కేసీ రామమూర్తి, సౌమ్యారెడ్డి ఆవేదన
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : చేతికి వచ్చింది నోటికి అందేలోగా నేలపాలైనట్లుంది సౌమ్యారెడ్డి పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ గాలి వీచిన సమయంలో బెంగళూరు నగర పరిధి జయనగర నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేసిన ఈ యువనాయకురాలు విజయం సాధించినవని అంతా భావించారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.. ఈలోగా భాజపా నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మధ్యాహ్నం రెండుగంటల సమయానికి 160 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారని ప్రసార మాధ్యమాలు ప్రకటించేశాయి. ప్రత్యర్థి భాజపా అభ్యర్థి కేసీ రామమూర్తి ఈ ప్రసారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి.. పోస్టల్ ఓట్ల రీ కౌంటింగ్కు పట్టుపట్టారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన డిమాండును అధికారులు అంగీకరించి లెక్కింపునకు సిద్ధమైనవేళ.. కౌంటింగ్ కేంద్రం వెలుపల ఇరుపార్టీల కీలక నేతలు మొహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెంగళూరు నగర జిల్లా ఎన్నికల అధికారి తుషార్గిరినాథ్ సమక్షంలో మూడు సార్లు ఓట్లు లెక్కించారు. చివరికి భాజపా అభ్యర్థి కేసీ రామమూర్తికి 57797 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డికి 57781 ఓట్లు దక్కినట్లు ప్రకటించారు. రామమూర్తి 16 ఓట్ల మైజార్టీతో గెలుపొందారని ప్రకటించారు. అప్పటి వరకు విజయానందంలో మునిగితేలిన కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి కంటతడి పెడుతూ కారు ఎక్కి ఇంటికి పయనమయ్యారు. ఇది అధికారుల చీకటి నిర్ణయమంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినదించారు. ఓట్ల లెక్కింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసనలో మానహననం?.. ప్రజ్వల్ విచారణ దారెటు?
[ 02-05-2024]
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల చూపంతా హాసనవైపు మళ్లింది. ప్రచార సంబంధంలేని వ్యవహారం.. అందరి సామాజిక మాధ్యమాలనూ ముంచెత్తుతోంది. కొందరు మహిళలతో స్థానిక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరించిన తీరే చర్చకు కారణం. -
నేతల దూకుడు.. మాటల చెడుగుడు
[ 02-05-2024]
మరో నాలుగు రోజుల్లో బహిరంగ ప్రచారం ముగుస్తుండటంతో జాతీయ నేతలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొద్ది సమయంలోనే ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
ఆ పాస్పోర్ట్ రద్దు చేయండి
[ 02-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. -
ఉమేశ్ జాదవ్కు అస్వస్థత
[ 02-05-2024]
కలబురగి-బెంగళూరు రహదారిపై బుధవారం ధర్నా చేస్తున్న సమయంలో లోక్సభ సభ్యుడు ఉమేశ్ జాదవ్ కళ్లుతిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తల్లీ, కుమారుడి సన్యాసదీక్ష
[ 02-05-2024]
రాజధాని నగరంలో ప్రముఖ వ్యాపారి మనీశ్ భార్య, కుమారుడు ఇద్దరూ జైన సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్ జైన్ (11)లకు జైన గురువులు దీక్ష ఇచ్చారు. -
పూర్వ గోవింద ‘కీర్తన’
[ 02-05-2024]
శ్రీరామ కోటి తరహాలో బెంగళూరుకు చెందిన కీర్తన (17) అనే బాలిక ‘గోవింద కోటి’ని రాసి తిరునగరి తిరుమలలో ఓ మెరుపు మెరిసిన వేళ.. కన్నడిగుల అభినందనలు వెల్లువెత్తాయి. -
‘సిద్ధు నాకు మద్దతిచ్చారు’
[ 02-05-2024]
శాసనసభ ఎన్నికల్లో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ గంగావతి, బళ్లారిలో తనతో చేతులు కలిపి మద్దతు ఇచ్చారని శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి రాలేదన్నారు. -
ఆ వ్యాఖ్యలు సలసలా ‘కాగె’
[ 02-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాకిస్థానీ యువత.. మోదీలాంటి నేతనే కోరుతోంది
[ 02-05-2024]
పాకిస్థానీ యువత సైతం ప్రధాని నరేంద్రమోదీ లాంటి నేతను కోరుకుంటోందని భాజపా నేత సి.టి.రవి పేర్కొన్నారు. ఆయన బుధవారం గంగావతిలో భాజపా అభ్యర్థి ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. -
విజయం.. ఓ వెన్నదోసె!
[ 02-05-2024]
దావణగెరె.. కన్నడిగుల మాంచెస్టర్ నగరిగా ఒకనాడు ప్రసిద్ధి! లెక్కకు మించిన వస్త్ర పరిశ్రమలతో.. వేలాది కార్మికులతో.. నిత్యం ఎర్రజెండాల రెపరెపలతో కళకళలాడిన నగరి నేడు ఆధునికీకరణ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు దావణగెరె పేరుచెబితే.. కన్నడిగులు లొట్టలేసుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి