logo

సిద్ధరామయ్యపై భాజపా ఫిర్యాదు

తెల్లకార్డు ఉన్న వారికి అన్నభాగ్య పథకం కింద ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తున్నామని, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాగే ఇచ్చామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు.

Published : 16 Apr 2024 01:11 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : తెల్లకార్డు ఉన్న వారికి అన్నభాగ్య పథకం కింద ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తున్నామని, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాగే ఇచ్చామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. దీనిపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బళ్లారిలో రాజ్యసభ సభ్యుడు నాసిర్‌ హుసేన్‌ అనుమతి లేకుండా ప్రచారాన్ని చేశారని, చిత్రదుర్గలో 70 వేల ఆధిక్యాన్ని వచ్చేలా చేస్తే ముఖ్యమంత్రితో రూ.25 కోట్లు విడుదల చేయిస్తానని మంత్రి డి.సుధాకర్‌ చేసిన వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేశామని భాజపా న్యాయ విభాగం ప్రతినిధి వివేక్‌ రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని