ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది.
నేహా హత్యపై నిరసన సెగలు
బెంగళూరు : నేహా’ హత్యకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తల నినాదాలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ్ను ధార్వాడలోని కేఎల్ఈ అనుబంధ కళాశాల ఆవరణలోనే గురువారం దారుణంగా హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షను విధించాలంటూ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనకు దిగారు. బెంగళూరు ఎస్బీఎం కూడలిలో ధర్నా సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు ఎక్కువ అయ్యాయని ఆందోళనకారులు ఆరోపించారు. ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు ఠాణాకు తీసుకువెళ్లారు. వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
నిందితుడికి కస్టడీ
హుబ్బళ్లి: కళాశాల ఆవరణతో సహ విద్యార్థిని నేహాను హత్య చేసిన మునవళ్లి నివాసి ఫయాజ్ను శుక్రవారం ఉదయం వరకు పోలీసులు విచారించి, ఆపై న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. రెండు వారాలు న్యాయనిర్బంధానికి పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరుతూ హుబ్బళ్లిలో ఏబీవీపీ, భాజపా, ఇతర హిందూ సంఘాల కార్యకర్తలు శుక్రవారం ధర్నాకు దిగారు. కళాశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించారు. విద్యార్థులు రహదారులపైకి వచ్చి టైర్లు వేసి కాల్చారు. తనను ప్రేమించాలని వెంట పడుతూ వేధిస్తున్నా నేహా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని పోలీసులు గుర్తించారని కమిషన్ రేణుకా సుకుమార్ వివరించారు.
బెళగావి : ధార్వాడ విద్యార్థిని హత్యకు నిరసనగా ప్రదర్శన
ముఖ్యమంత్రిదే బాధ్యత
బెంగళూరు (మల్లేశ్వరం): హుబ్బళ్లి ఘటనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత వహించాలని మాజీ మంత్రి వి.సునీల్కుమార్ డిమాండు చేశారు. ఒక మతానికి చెందిన వారికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బెంగళూరులో ఆయన శుక్రవారం దుయ్యబట్టారు.
ఇది లవ్ జిహాద్ కాదని, తనను ప్రేమించని యువతిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు కత్తితో పొడిచి హత్య చేశాడని హోం మంత్రి పరమేశ్వర్ స్పష్టం చేశారు. హంతకుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాసనలో తెలిపారు. పరమేశ్వర్ వ్యాఖ్యలను విపక్ష నేత అశోక్ ఖండించారు. లవ్ జిహాద్కు పాల్పడేవారికి ప్రభుత్వం పాస్పోర్టులు ఇస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో శాంతిభద్రతలను కాపాడడం ప్రభుత్వానికి సాధ్యం కాదని ధ్వజమెత్తారు. ఇటువంటి ఘటనలు సంభవించినప్పుడు ప్రభుత్వం ప్రేక్షకుడి పాత్ర పోషిస్తోందని మాజీ మంత్రి సీటీ రవి ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు. తన కుమార్తె ఎవరినీ ప్రేమించలేదని, ప్రేమను నిరాకరించడంతోనే హత్యకు గురైందని నేహా తండ్రి, ధార్వాడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ్ ఆక్రోశించారు.
నేడు హుబ్బళ్లి బంద్
హుబ్బళ్లి: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ కుమార్తె నేహాను హత్య చేసిన యువకుడి తల నరికితే రూ.10 లక్షలు ఇస్తామని జయ కర్ణాటక సంఘటన నాయకుడు ఇజారి ప్రకటించడం కలకలం రేపింది. ఆయన శనివారం హుబ్బళ్లి బంద్కు ఆయన పిలుపునిచ్చారు. బీవీబీ కళాశాల నుంచి తాము ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసేందుకు చట్టం తీసుకురావాలని మంత్రి సంతోశ్లాడ్ అభిప్రాయపడ్డారు. కిమ్స్ శవాగారంలో హత్యకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులను ఆయన శుక్రవారం పరామర్శించారు. విద్యార్థిని హత్యను ఖండిస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు మండ్యలోనూ ధర్నా నిర్వహించారు. తన కుమారుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఈ కేసులో నిందితుడు ఫయాజ్ తండ్రి బాబాసాహెబ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. తన కుమారుడు ఘోరమైన తప్పు చేసి, తనకు, తమ మునవళ్లి గ్రామానికి చెడ్డపేరు తెచ్చాడని ఆక్రోశించారు. తన కుమారుడ్ని సైనికుడ్ని చేయాలన్న కల ఇప్పుడు కరిగిపోయిందన్నారు. విచారణ వేగంగా పూర్తి చేసి, ఫయాజ్కు త్వరగా శిక్ష పడాలని కోరుకుంటున్నానని తెలిపారు. హంతకుడికి జామీను లభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేహా తండ్రి నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇది వ్యక్తిగత కారణానికి జరిగిన హత్య అంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రేమను నిరాకరించినందుకే జరిగిన హత్య అని స్పష్టం చేశారు. తన కుమార్తెకు చెడ్డపేరు తీసుకురావద్దని ముఖ్యమంత్రి, హోం మంత్రిని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసనలో మానహననం?.. ప్రజ్వల్ విచారణ దారెటు?
[ 02-05-2024]
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల చూపంతా హాసనవైపు మళ్లింది. ప్రచార సంబంధంలేని వ్యవహారం.. అందరి సామాజిక మాధ్యమాలనూ ముంచెత్తుతోంది. కొందరు మహిళలతో స్థానిక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరించిన తీరే చర్చకు కారణం. -
నేతల దూకుడు.. మాటల చెడుగుడు
[ 02-05-2024]
మరో నాలుగు రోజుల్లో బహిరంగ ప్రచారం ముగుస్తుండటంతో జాతీయ నేతలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొద్ది సమయంలోనే ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
ఆ పాస్పోర్ట్ రద్దు చేయండి
[ 02-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. -
ఉమేశ్ జాదవ్కు అస్వస్థత
[ 02-05-2024]
కలబురగి-బెంగళూరు రహదారిపై బుధవారం ధర్నా చేస్తున్న సమయంలో లోక్సభ సభ్యుడు ఉమేశ్ జాదవ్ కళ్లుతిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తల్లీ, కుమారుడి సన్యాసదీక్ష
[ 02-05-2024]
రాజధాని నగరంలో ప్రముఖ వ్యాపారి మనీశ్ భార్య, కుమారుడు ఇద్దరూ జైన సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్ జైన్ (11)లకు జైన గురువులు దీక్ష ఇచ్చారు. -
పూర్వ గోవింద ‘కీర్తన’
[ 02-05-2024]
శ్రీరామ కోటి తరహాలో బెంగళూరుకు చెందిన కీర్తన (17) అనే బాలిక ‘గోవింద కోటి’ని రాసి తిరునగరి తిరుమలలో ఓ మెరుపు మెరిసిన వేళ.. కన్నడిగుల అభినందనలు వెల్లువెత్తాయి. -
‘సిద్ధు నాకు మద్దతిచ్చారు’
[ 02-05-2024]
శాసనసభ ఎన్నికల్లో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ గంగావతి, బళ్లారిలో తనతో చేతులు కలిపి మద్దతు ఇచ్చారని శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి రాలేదన్నారు. -
ఆ వ్యాఖ్యలు సలసలా ‘కాగె’
[ 02-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాకిస్థానీ యువత.. మోదీలాంటి నేతనే కోరుతోంది
[ 02-05-2024]
పాకిస్థానీ యువత సైతం ప్రధాని నరేంద్రమోదీ లాంటి నేతను కోరుకుంటోందని భాజపా నేత సి.టి.రవి పేర్కొన్నారు. ఆయన బుధవారం గంగావతిలో భాజపా అభ్యర్థి ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. -
విజయం.. ఓ వెన్నదోసె!
[ 02-05-2024]
దావణగెరె.. కన్నడిగుల మాంచెస్టర్ నగరిగా ఒకనాడు ప్రసిద్ధి! లెక్కకు మించిన వస్త్ర పరిశ్రమలతో.. వేలాది కార్మికులతో.. నిత్యం ఎర్రజెండాల రెపరెపలతో కళకళలాడిన నగరి నేడు ఆధునికీకరణ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు దావణగెరె పేరుచెబితే.. కన్నడిగులు లొట్టలేసుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు