అక్క ఇంట్లో చెల్లి చోరీ!
సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు. నాగదేవనహళ్లి నివాసి, సిమెంట్ ఇనుము వ్యాపారి కున్నెగౌడ (ఉమా అక్క భర్త) ఇంట్లో ఆమె దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. గత నెల 22న కున్నెగౌడ సొంత ఊరులో చౌడేశ్వరిదేవి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి తాళాలను ఉమాకు ఇచ్చి రాత్రిపూట ఇక్కడే ఉండాలని సూచించారు. 24న ఉదయం ఆయనకు పోలీసుల నుంచి ఫోన్కాల్ వచ్చింది. ఇంట్లో దొంగలు పడ్డారని సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసి.. దొంగల పాలైన సొత్తు విషయం పోలీసులకు వివరించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉమాను విచారించారు. వారి ప్రశ్నలకు భయపడి ‘నేనే నేరం చేశా’నంటూ అంగీకరించింది. నకిలీ తాళాలతో బీరువా తీసి సొత్తు ఎత్తుకెళ్లి, దాచేసినట్లు వివరించింది.
శిక్ష పడకపోతే.. బుద్ధి మారదు
మైసూరు, న్యూస్టుడే: లైంగిక వేధింపులు, లైంగిక దౌర్జన్యం, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ను అరెస్టు చేసి, శిక్షించాలని ఒక బాధితురాలి సోదరి (పేరు అప్రస్తుతం..) డిమాండు చేసింది. ఒక వీడియోలో తన సోదరి అక్క ఉండటాన్ని చూసి కంగుతిన్నానని ఆమె చెప్పారు. ఆమె మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న భయంతో భవానీ రేవణ్ణకు బంధువు సతీశ్ బాబణ్ణతో అపహరించి, ఒక ఫారంహౌస్లో దాచి పెట్టారని ఆక్రోశించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో తమ సోదరి ప్రాణాలతో బయటపడిందన్నారు. ప్రజ్వల్ను అరెస్టు చేయకపోతే, ఇటువంటి అకృత్యాలను మళ్లీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిషత్తు పోరులోనూ కాసుల మాటే !
[ 19-05-2024]
విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్ చెంతకు చేరుతాయి. -
ప్రజ్వల్ తప్పించుకోలేడు
[ 19-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. -
ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!
[ 19-05-2024]
ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. -
ప్రధాని వ్యాఖ్యలు షాకిచ్చాయి
[ 19-05-2024]
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘డీకేపై అర్థరహిత ఆరోపణలు’
[ 19-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పెన్డ్రైవ్ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ -
ఆటవిడుపు
[ 19-05-2024]
నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు. -
‘ఐస్క్రీమ్ మ్యాన్’ ఇకలేరు
[ 19-05-2024]
ఐస్క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్క్రీమ్ మ్యాన్’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్ కామత్ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
[ 19-05-2024]
ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు