సిట్ నిరుపయోగం: కుమార
అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు.
రాజభవన్లో గవర్నర్ థావర్చంద్ గహ్లోత్కు గురువారం ఫిర్యాదుపత్రాన్ని అందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.
చిత్రంలో మాజీ మంత్రులు జీటీ దేవేగౌడ, సా.రా.మహేశ్ తదితరులు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : అశ్లీల వీడియోల పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ఒక్క అడుగూ ముందుకు వేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆక్రోశించారు. ఈ కేసులో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, జనతాదళ్కు మరక అంటించాలనేదే కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. బెంగళూరులోని దళ్ కార్యాలయంలో గురువారం కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ థావర్చంద్ గహ్లోత్కు సిట్, ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్ రక్షించినట్లు చెబుతున్న బాధితురాలిని ఇప్పటి వరకు న్యాయమూర్తి ముందు ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. హెచ్డీ రేవణ్ణను కారాగారంలో ఉంచాలని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోందని దుయ్యబట్టారు. ఒక ఫాంహౌస్ నుంచి రక్షించిన బాధితురాలిని ప్రభుత్వ గెస్ట్ గౌస్లో ఉంచి, రేవణ్ణ, ప్రజ్వల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం అందిందని వివరించారు. కొందరు మంత్రులు నన్నే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. సీబీఐకి.. లేదా సిట్టింగ్ జడ్జ్కు బాధ్యతలు అప్పగిస్తే దర్యాప్తు చురుకుగా కొనసాగుతుందని కుమార అభిప్రాయపడ్డారు.
- దర్యాప్తు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హోం మంత్రి పరమేశ్వర్ హాసనలో వ్యాఖ్యానించారు. తాజా ఘటనలో భాజపా, దళ్ పొత్తుకు వచ్చిన ముప్పు ఏమీ లేదని మాజీ మంత్రి జీటీ దేవేగౌడ ధీమా వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోనే దర్యాప్తు కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజ్వల్ కోసం బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసి 194 దేశాల్లో ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదు అంటూ, ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
‘కుమార బెదిరింపు ధోరణి’
బెంగళూరు (యశ్వంతపుర): హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి బాధితులను బెదిరించడం, దర్యాప్తును దారి తప్పించే విధంగా ప్రకటనలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండు చేశారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శి మనోహర్ నేతృత్వంలో ఆపార్టీ ప్రతినిధులు గురువారం సీఓడీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన పెన్డ్రైవ్ తన వద్ద ఉన్నట్లు భాజపా నేత దేవరాజేగౌడ ప్రకటించారని, వాస్తవాలను పక్కన పెట్టి అవాస్తవాలను మాజీ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులను పరోక్షంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసే ప్రకటనలు వల్ల బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్)పై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు నిందితులను రక్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక