డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే.
ప్రైవేటు వైద్యుడిపై కేసు నమోదు
బాలుడి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట మౌనపోరాటం చేస్తున్న రైతు సంఘం ప్రముఖులు
హొసపేటె, న్యూస్టుడే: డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యుడు హెచ్.ఆర్.గవియప్ప ఆసుపత్రికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మృతికి కారణాలను వైద్యుడి నుంచి అడిగి తెలుసుకున్నారు. ‘మీ ఆసుపత్రిపైన చాలా ఫిర్యాదులు ఉన్నాయి, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అక్కడే ఉన్న జిల్లా వైద్యశాఖ అధికారిని ఉద్దేశించి ఆసుపత్రి వైద్యుడిపైన పోలీస్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బాలుడి అంత్యక్రియలకు రూ.50వేలు అందించారు. ప్రైవేటు వైద్యుడు సరైన చికిత్స ఇవ్వకపోవడంతో బాలుడు మృతిచెందాడని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొసపేటె అమరావతిలోని శరణం ఆసుపత్రి వైద్యుడు వినయ్ రాఘవేంద్రపైన గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే నా కొడుకు గౌతమ్ మృతిచెందాడని తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్ స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందివ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారికి సూచించారు.
రైతు సంఘం ఆందోళన: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు గౌతమ్ మృతిచెందాడని ఆరోపిస్తూ కర్ణాటక ప్రాంతం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, బాలుడి కుటుంబ సభ్యులు గురువారం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట మౌనపోరాటం చేశారు. ఈ సందర్భంగా గాళెప్ప, తదితరులు మాట్లాడుతూ హొసపేటెలోని శరణం ఆసుపత్రిలో ఇలాంటి చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే విచారణ చేయించి, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరారు. జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం