కారాగారంలో కునుకే కరవాయె
కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు.
హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : కిడ్నాప్ కేసులో అరెస్టై.. పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్లో ఉన్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు 4567 నంబరును కేటాయించారు. మానసిక వ్యధతో ఆయన బుధవారం రాత్రి నిద్రకు దూరమయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు చపాతి, వేపుడు, రాగి సంగటి, అన్నం, సాంబారు ఇచ్చారు. భోజనం ఇచ్చినా.. అర్ధరాత్రి వరకు కంచాన్ని దగ్గరకు తీసుకోలేదని సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం. నీరు తాగుతూ గడిపిన ఆయన అర్ధరాత్రి అనంతరం కొంత రాగిసంకటి, చపాతి, సాంబారు అన్నం తిన్నారు. ఇంటి నుంచి వచ్చిన దుస్తులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా లేకపోవడంతో బ్యారెక్ వద్ద అదనపు సిబ్బందితో నిఘా పెట్టారు. తెల్లవారు జామున కొంత సమయం నిద్రపోయారు. ఉదయం 5.30కి ఆయనకు కాఫీ ఇచ్చారు. చదువుకునేందుకు కన్నడ, ఆంగ్ల దినపత్రికలను అందుబాటులోకి తెచ్చారు. కాసేపు వాటిని చూసిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నారు. అల్పాహారంగా పులియోగెరె అందించారు. తనకు కడుపు నొప్పి అని చెప్పడంతో కారాగారంలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. మధ్యాహ్నం కొంత ఆహారాన్ని తీసుకున్నాక.. నిద్రలోకి జారుకున్నారు.
విచారణ వాయిదా
బెంగళూరు (సదాశివనగర): ఒక మహిళను అపహరించి, బంధించిన ఆరోపణలతో అరెస్టయిన మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ జామీను కోసం వేసుకున్న అర్జీ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రేవణ్ణ తరపు న్యాయవాది సీవీ నాగేశ్, సిట్ తరపు న్యాయవాది జయ్నా కొఠారి రెండు గంటల పాటు చేసిన వాదనలను న్యాయమూర్తి సంతోష గజానన భట్ ఆలకించారు. జామీను అర్జీపై ఆక్షేపణలు చెప్పేందుకు తమకు సమయం కావాలని సిట్ కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. తనను రేవణ్ణ అపహరించారని బాధిత మహిళ ఇప్పటి వరకు ఫిర్యాదులో పేర్కొనకపోయినా, రేవణ్ణను నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సరికాదని సీవీ నాగేశ్ తన వాదనలలో పేర్కొన్నారు. బాధితురాలిని రక్షించామని సిట్ ఇప్పటికే ప్రకటించినా, విచారణకు సంబంధించి ఇప్పటి వరకు వివరాలను న్యాయస్థానానికి దాఖలు చేయలేదని తెలిపారు. రేవణ్ణకు జామీను మంజూరు చేస్తే తన కుమారుడు ప్రజ్వల్కు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని జయ్నా కొఠారి వాదించారు.
సిట్ అదుపులో నలుగురు
మైసూరు: కేఆర్ నగరకు చెందిన ఒక మహిళను అపహరించి, నిర్బంధించిన ఆరోపణలపై నలుగురు నిందితులను సిట్ అదుపులోనికి తీసుకుంది. సుజయ్, కీర్తి, తిమ్మప్ప, మను అనే జనతాదళ్ కార్యకర్తలను నిందితులుగా గుర్తించారు. అపహరణ ఘటనలో ఇప్పటికే అరెస్టయిన రేవణ్ణ ఆప్త సహాయకుడు సతీశ్ బాబణ్ణతో కలిసి వీరు పని చేశారని దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించింది. సతీశ్ అరెస్టు అనంతరం పరారైన వీరిని గాలింపు చేపట్టి బంధించారు.
భవానీకి నోటీసులు
బెంగళూరు (మల్లేశ్వరం): తమ ముందు విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ భార్య భవానీకి సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసులకు ఆమె బదులిచ్చారు. తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఉండడంతో విచారణకు హాజరు కాలేనని మౌఖికంగా చెప్పారు. వాట్సప్ ద్వారా పంపించిన నోటీసులకు ఆమె స్పందించలేదు. దానికీ స్పందించకపోతే మూడో నోటీసును ఇచ్చి, ఆమెను అదుపులోనికి తీసుకుంటామని సిట్ అధికారులు తెలిపారు.
ప్రజ్వల్ ఎప్పుడొస్తారో..
ప్రజ్వల్ రేవణ్ణ
హాసన, న్యూస్టుడే : లైంగిక దౌర్జన్యాల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆ వ్యవహారాల వీడియోలను పెన్డ్రైవ్ ద్వారా బహిర్గతం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కారు డ్రైవరు కార్తిక్ అలియాస్ పుట్ట అలియాస్ పుట్టరాజ్, అతని సన్నిహితులు నవీన్ గౌడ, చేతన్ల కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. తమకు ముందస్తు జామీను మంజూరు చేయాలని కోరుతూ కార్తిక్ మిత్రులు హాసనలోని మూడో అదనపు జిల్లా, ఫాస్ట్ట్రాక్ న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. అర్జీని న్యాయమూర్తి గురువారం తోసిపుచ్చారు.
- ఎన్నికలు జరిగిన వెంటనే జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్ ఆ తరువాత ఎక్కడకు వెళ్లాడో సిట్ అధికారులు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. దుబాయ్ వెళ్లి అక్కడే తలదాచుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసినా ప్రజ్వల్ ఆచూకీ తెలియరాలేదు. ఆయన ఈనెల 15న వస్తారని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం