దశదిశలా బాలల సంబరమే
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు.
పదిలో 73.40 శాతం ఉత్తీర్ణత
బాగలకోటె బాలిక ‘శత గణోత్సవం’
ఎప్పటిలాగే బాలికలదే ఈసారీ పైచేయి
ఫలితాలను ప్రకటిస్తున్న మంజుశ్రీ
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : రాష్ట్రవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 2,750 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 73.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలికలు ఎక్కువ మంది ముందడుగు వేశారు. బాగలకోటె మెళ్లిగేరి మొరార్జీ దేశాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంకిత బసప్ప 625కు 625 మార్కులతో ఓ మెరుపు మెరిసింది. హర్షిత (మధుగిరి), సిద్ధాంత్ (చిక్కోడి), చిన్మయ్ (దక్షిణ కన్నడ), సహన (ఉడుపి), దర్శన్ (సిరసి), శ్రీరామ్ (సిరసి), వేదా పి శెట్టి (బెంగళూరు) రెండో ర్యాంకు దక్కించుకున్నారు. వారి తరువాతి ర్యాంకుల్లో సౌరవ్ కౌశిక్, తృప్తి రామచంద్రగౌడ, చైతన్య గణపతి హెగ్డే, మాన్యత మయ్య అనే విద్యార్థులు సత్తా చాటారు.
ఈ ఏడాది బాలికలు 81.11 శాతం, బాలురు 65.90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 83.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 10.4 శాతం ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 14వ స్థానంలో నిలిచిన ఉడుపి జిల్లా విద్యార్థులు ఈ ఏడాది మొదటి స్థానానికి రాగా.. గతేడాది లాగే ఇప్పుడూ యాదగిరి చివరిస్థానంలో నిలిచింది. మొత్తం 78 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయని పరీక్ష మండలి అధ్యక్షురాలు మంజుశ్రీ ప్రకటించారు. ఈ ఏడాది 8,69,968 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 6,31,204 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటిసారిగా వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేయడంతో 20 శాతం వెయిటేజ్ మార్కులను కేటాయించామన్నారు. వచ్చే ఏడాది నుంచి వెయిటేజ్ మార్కులు ఉండవన్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ‘ఫెయిల్’ బదులుగా ‘ఇన్ కంప్లీట్’ అని మార్కుల జాబితాపై ముద్రించి ఇస్తామని తెలిపారు.
బెంగళూరు : సర్దార్ పటేల్ పాఠశాలలో ర్యాంకర్లకు మిఠాయి తినిపిస్తున్న ఉపాధ్యాయురాలు
గ్రామీణులే భళా..
నగర ప్రాంతానికి చెందిన విద్యార్థులు 72.83 శాతం, గ్రామీణ విద్యార్థులు 74.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలు 72.46 శాతం, ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న పాఠశాలలు 72.22 శాతం, ప్రైవేటు పాఠశాలలు 86.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడు ప్రభుత్వ, 13 గ్రాంటెడ్, గ్రాంటులు అందుకోని 62 పాఠశాలలు జీరో ఫలితాలు పొందాయి. గత ఏడాది 14వ స్థానంలో నిలిచిన ఉడుపి ఈ ఏడాది మొదటి స్థానానికి చేరగా, గత ఏడాది మొదటిస్థానంలో నిలిచిన చిత్రదుర్గ విద్యార్థులు ఈ ఏడాది 21వ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. సిరసికి చెందిన దర్శన్ భట్, చిన్మయ హెగ్డే, కేఎం శ్రీరామ రెండో ర్యాంకు, తృప్తి గౌడ మూడో ర్యాంకు దక్కించుకున్నారు.
ప్రథమ ర్యాంకర్ అంకిత బసప్పను సత్కరిస్తున్న బాగల్కోటె జిల్లా అధికారులు
చదువులకే అంకితం
బాగలకోటెలో తల్లిదండ్రులు బసప్ప, గీతతో మొదటి ర్యాంకర్ విద్యార్థిని అంకిత
బాగలకోటె, న్యూస్టుడే : చక్కగా చదువుకుని ఐఏఎస్ అధికారినై తన ప్రాంతానికి సేవలు చేయాలన్నది తన కల అని ప్రభుత్వ పాఠశాలలో చదివి వంద శాతం మార్కులు పొందిన అంకిత బసప్ప వివరించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వజ్జరమట్టిలో ఆమె చదివారు. ఆరో తరగతి నుంచి మెళ్లిగేరి మొరార్జీ దేశాయి ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్లో ఉంటూ చదువుకుంది. మొరార్జీ దేశాయి హాస్టల్లో చేరేందుకు రాసిన ప్రవేశ పరీక్షల్లోనూ 98 శాతం మార్కులు పొందింది. బాగలకోటె జిల్లా వజ్జరమట్టికి చెందిన ఆమె తండ్రి బసప్పకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ పొలంలో పని చేస్తేనే వారికి పూట గడుస్తుంది. తల్లిదండ్రులు గుడిసెలోనే ఉంటున్నారని ఆమె వివరించారు. ‘నాకన్నా అమ్మానాన్న, నాకు పాఠాలు చెప్పిన గురువులు సంతోషంగా ఉన్నారు. పీయూసీలో సైన్స్ విభాగంలో చేరతాను’ అని అంకిత చెప్పారు. ‘కష్టమైనా కుమార్తె ఆశ పడినట్లు చదివిస్తాను’ అని బసప్ప తెలిపారు. మంత్రి ఆర్బీ తిమ్మాపుర వజ్జరమట్టి గ్రామానికి వచ్చి అంకితను సత్కరించారు. జిల్లాధికారి కేఎం జానకి, జిల్లా పంచాయతీ సీఈఓ శశిధర కురేర కూడా ఆమెను సత్కరించారు. అంకిత బసప్ప తదుపరి విద్యాభ్యాసానికి తమ సహకారం ఉంటుందని మంత్రి, జిల్లాధికారి భరోసా ఇచ్చారు.
సమాధాన పత్రాలు..
తమ సమాధాన పత్రాలను స్కానింగ్ చేసి అందుకునేందుకు 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. రీవాల్యుయేషన్కు మే 13-22 మధ్యలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు జూన్ 7-14 వరకు పరీక్షలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!