కొవిడ్ కట్టడికి సన్నద్ధం కావాలి: మంత్రి అజయ్
కొవిడ్ ఉద్ధృతి, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా సేవలు అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రితోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అందుకోసం
మాట్లాడుతున్న మంత్రి అజయ్కుమార్. చిత్రంలో కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్, తాతా మధు, కమల్రాజు, మేయర్ నీరజ, తదితరులు
ఈటీవీ, ఖమ్మం: కొవిడ్ ఉద్ధృతి, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా సేవలు అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రితోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు మరోసారి స్వీయ రక్షణ పాటించాలని.. అర్హులందరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కొవిడ్ నివారణ చర్యలు, ఆక్సీజన్ నిల్వలు, పడకలు, ఔషధాలు తదితర అంశాలపై మంగళవారం ఆయన జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా యాజమాన్యాలతో చర్చించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా ఆస్పత్రి కమిటీ సమావేశం ప్రతీ నెలా కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. వ్యాక్సినేషన్ రెండో డోసు ఈ నెలాఖరు లోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో త్వరలోనే వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఉంటుందన్నారు. అనంతరం చింతకాని మండలంలో దళితబంధు పథకం అమలుపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో దళిత కుటుంబాల్లో వెలుగు నింపేలా అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు. సమీక్షలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు.ఎస్.వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పర్యటన
ఖమ్మం నగరపాలకం: మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లో సీసీ రహదారులను ప్రారంభిస్తారు. అనంతరం రఘునాధపాలెం మండలం గణేశ్వరం, గేట్కారేపల్లి, కొత్తగూడెం కలెక్టరేట్లో సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.