రాములోరి పట్టాభిషేకం... చూతమురారండి
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పన్నెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న అతి పెద్ద క్రతువు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం.
భద్రాచలం, న్యూస్టుడే
సీతారాముల వారి పట్టాభిషేకం (పాత చిత్రం)
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పన్నెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న అతి పెద్ద క్రతువు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం. మార్చి 31న నిర్వహించేందుకు వైదిక కమిటీ ప్రకటించిన నేపథ్యంలో దీన్ని భక్తులు మురిసేలా నిర్వహించాల్సి ఉంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీరామ నవమిని ప్రధాన పండుగగా భావించి ఏర్పాట్లు చేస్తుంటారు. ఈసారి నవమితో పాటు ఆ తర్వాత రోజు వచ్చే పట్టాభిషేకానికి ప్రాధాన్యతనిస్తూ ఈవో శివాజీ చర్యలు చేపట్టారు.
నలుదిక్కులకు వైదిక బృందం
ఈ ఏడాది రాములోరి కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు. తలంబ్రాలను కలిపే తేదీ అధికారికంగా ఖరారు కానప్పటికీ మార్చి 7న ఈ ఉత్సవం ఉంటుందని సమాచారం. ఆరోజు నుంచి ఎంపిక చేసిన పది మంది వైదిక సిబ్బంది దేశంలోని నలు దిక్కులకు పర్యటించి పుణ్య జలాలను సేకరించి పట్టాభిషేకానికి తేవాల్సి ఉంది. వీరంతా మార్చి 18కి భద్రాచలం చేరుకుంటారు. ఏ నది జలాన్ని ఎక్కడ నుంచి సేకరించాలన్నది ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణయించారు. గోదావరి, గంగాధర, శ్వేత పుష్కరిణి, నర్మద, పూరిలోని సముద్రం తీర్థాన్ని తూర్పు దిక్కు నుంచి తీసుకురానున్నారు. పశ్చిమాన ఉన్న గోపీ తలాబ్, పుష్కర్, చంద్రభాగ జలాన్ని పాత్రల్లో తేవాల్సి ఉంది. ఉత్తరంలోని గంగ, యమున, సరస్వతి, సరయు, గోమతి నదులను గుర్తించారు. దక్షిణంలోని కావేరి, తామ్రపర్ణి, పినాకిని, కపిల తీర్థం, తిరుమల స్వామి పుష్కరిణి, పద్మ పుష్కరిణి, అనంత పుష్కరిణి, కల్యాణ పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి, శ్రీరామ పుష్కరిణి వంటి చోట్లకు వెళ్లనున్నారు. రూ.కోటితో స్వామివారికి 12 వాహనాలను సమకూర్చుతున్నారు. వీటిలోనే తిరువీధి సేవ ఉంటుంది.
అంతర్గత సమస్యలూ పరిష్కరించుకోవాలి
ఉత్సవాల నేపథ్యంలో అంతర్గత సమస్యలనూ పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం ఐదుగురు కీలక సిబ్బందితో వైదిక కమిటీ పని చేస్తోంది. వీరు తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యత ఉంటుంది. రామాలయంలో ఇద్దరు ప్రధానార్చకులు ఉన్నా ఈ కమిటీలో ఒక్కరే పనిచేస్తున్నారు. ఇందులో మరో ప్రధానార్చకుడికి అవకాశం కల్పించి ఆరుగురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది.
ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నందున ఆహ్వాన పత్రికలను సిద్ధం చేయాలి. ముత్యాల తలంబ్రాలకు పట్టు వస్త్రాలకు అధికారిక లాంఛనాల మొత్తాన్ని పెంచాలి. కల్యాణం-పట్టాభిషేకం సెక్టార్లో 20 వేల మందికి ప్రవేశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచాలి.
ఘనంగా నిర్వహిస్తాం: శివాజీ, ఈవో
ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరెవర్ని ఆహ్వానించాలన్నది త్వరలో స్పష్టత వస్తుంది. మరో ప్రధానార్చకుడ్ని వైదిక కమిటీలో తీసుకునే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.