దోచుకునేందుకు అడ్డదారులు
హైదరాబాద్కు దీటుగా సకల హంగులతో దూసుకుపోతున్న ఖమ్మం నగరంలో.. నేర స్వభావం గల కొందరు యువకులు పేట్రేగిపోతున్నారు.
వైరా, ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే
హైదరాబాద్కు దీటుగా సకల హంగులతో దూసుకుపోతున్న ఖమ్మం నగరంలో.. నేర స్వభావం గల కొందరు యువకులు పేట్రేగిపోతున్నారు. నగరం చుట్టూ నిర్మానుష్య ప్రాంతాల వైపు వెళ్తున్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే భయం ముంగిట నిల్చున్నామా అనే భావన ప్రస్ఫుటమవుతోంది.
* రఘునాథపాలెం సమీపంలో, ప్రధాన రహదారికి కొద్దిదూరంలో పగటిపూట కారులో వెళ్లిన ఓ జంటను గమనించిన యువకుడు వెంటనే తమ ముఠాను రప్పించాడు. మూడు వాహనాల్లో వెళ్లి జంటపై దాడి చేసి బంగారం, నగదు దోచుకున్నారు.
* ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే మార్గంలో ఓ పార్కు సమీపంలోకి యువజంట వెళ్లింది. కొద్ది క్షణాల్లోనే ఆకతాయిలు వచ్చి వారి నుంచి నగదు, బంగారం దోచుకుని వెళ్లిపోయారు. అడిగింది ఇవ్వకుంటే ఏమైనా చేస్తామని బెదిరించారు.
పగలూ పెట్రోలింగ్
ప్రేమ జంటలపై దాడుల నేపథ్యంలో కొద్దిరోజులుగా పోలీసులు పగటిపూట పెట్రోలింగ్పై దృష్టి సారించారు. నగర పరిధిలోని ఓ మామిడితోట సమీపంలో జంటను బెదిరించేందుకు వెళ్తున్న ఆకతాయిలను గుర్తించి హెచ్చరించారు. జంటకు కౌన్సెలింగ్ చేశారు.
వామ్మో.. ఎంత విలువో..?
ఇటీవల హైదరాబాద్ వెళ్తున్న ఓవాహనాన్ని ఖమ్మం రూరల్ పరిధిలో సదరు ముఠా అడ్డగించింది. వాహన యజమానిని బయటకు లాగి గొడవపడింది. అంతలోనే ఇంకొందరు వచ్చి దాడికి పాల్పడ్డారు. రూ.లక్షల్లో నగదు అపహరించారు. రోజుల వ్యవధిలోనే ప్రేమజంటల నుంచి కిలోకు పైగా బంగారం, రూ.లక్షల్లో నగదు తస్కరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. విద్యనభ్యసిస్తున్న ప్రేమ జంటలే ఎక్కువ మంది బాధితులు. వీరిలో కొందరి వివరాలు తెలుసుకుని పోలీసులు సంప్రదించినా ఫిర్యాదు చేసే ధైర్యం బాధితులకు చాలటం లేదు. ఇంకొందరు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించి గోప్యత పాటించాలని కోరుతున్నారు.
ఎక్కడెక్కడంటే..?
ఖమ్మం వెలుగుమట్లతోపాటు ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి ఇల్లెందు రహదారికి వెళ్లే బైపాస్, ఖమ్మం రూరల్ ప్రాంతం, రఘునాథపాలెం పరిసరాలు, అల్లీపురం, బోనకల్లు మార్గాల్లోని ప్రత్యేక ప్రాంతాలపై ఆకతాయిలు దృష్టి సారిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త..
* యువత ఏకాంతం కోసం నిర్జన ప్రదేశాలకు వెళ్లాలనుకోవటం ప్రమాదం, అనైతికమని గుర్తించాలి.
* దుండగులు ఒక్కొక్కరు ఒక్కోచోట ఉంటున్నారు. ఎక్కడైనా కారు లేదా బైకుపై నిర్జన ప్రదేశానికి వెళ్తున్న జంట కనిపిస్తే తమ ముఠాను రప్పిస్తున్నారు.
* బంగారం, నగదు దోచుకునే క్రమంలో ప్రతిఘటిస్తే దాడి చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకూ వెనకాడటం లేదు.
* నగరంలో ఎన్నో ప్రజాపార్కులున్నాయి. నిర్దేశిత సమయంలో ఉల్లాస వాతావరణం ఉంటుంది.
ఉపేక్షించే ప్రసక్తే లేదు
విష్ణు ఎస్ వారియర్, సీపీ
నగర శివార్లలో ప్రేమికులు, అమాయకులను బెదిరించి చోరీలకు పాల్పడే వారిని ఉపేక్షించబోం. ఇటీవల ఖమ్మం గ్రామీణ మండలంలో ఎనిమిది మందితో కూడిన ముఠాను అరెస్టు చేశాం. లకారం ట్యాంకుబండ్, బైపాస్రోడ్డు వెంట వివిధ ప్రాంతాల్లో అమాయకులను బెదిరించి బంగారం, నగదు దోచుకున్నారు. పెట్రోలింగ్ను పెంచుతున్నాం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతి తప్పిన గణితం... వికసించని విజ్ఞానం
[ 03-05-2024]
పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ను గెలిపించండి: మంత్రులు
[ 03-05-2024]
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. -
ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం
[ 03-05-2024]
భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
[ 03-05-2024]
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
సౌరమే సౌభాగ్యం
[ 03-05-2024]
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. -
పట్టభద్రులూ ఓటుకు పోటెత్తాలి
[ 03-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికయ్యారు. -
భానుడి భగభగలతో రెడ్ అలర్ట్
[ 03-05-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష గురువారం తెలిపారు. -
‘ఎర్లీబర్డ్’ రాబడి రూ.15.15 కోట్లు
[ 03-05-2024]
ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: నామా
[ 03-05-2024]
మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల
[ 03-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?