నిధులు ఖర్చు చేయకుంటే వెనక్కే!
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు పలు దఫాలుగా నిధులు మంజూరు చేస్తాయి.
కొత్తగూడెం పట్టణం సింగరేణి కాలరీస్ హైస్కూల్లో శిక్షణ కల్పిస్తున్న డీఈఓ కార్యాలయం సిబ్బంది
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు పలు దఫాలుగా నిధులు మంజూరు చేస్తాయి. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిర్ణీత మొత్తాన్ని విద్యాలయాల ఖాతాలకు జమ చేస్తుంది. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి మార్చి మొదటి వారం వరకు వివిధ గ్రాంట్ల రూపంలో నిధులు కేటాంచారు. సీఆర్పీలు, మండల విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ, క్రీడలు, విజ్ఞాన ప్రదర్శనలు, మధ్యాహ్న భోజన పథకం, సుద్ద ముక్కలు, తెల్లకాగితాలు, హాజరు పట్టికలు, ఇతర సామగ్రి, ఏ అవసరం ఉన్నా నిధులు వినియోగించుకోవాలి. ఇటీవల క్రీడా సామగ్రి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిర్ణీత వ్యవధిలో నిబంధనలకు అనుగుణంగా చేసిన వ్యయాల వివరాలను ‘పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం’(పీఎఫ్ఎంఎస్)లో బిల్లులు, ఇతరాలను పొందుపరచాలి. ఈ విషయమై ఇటీవల వరకు మండల విద్యా శాఖాధికారులతో ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కాంప్లెక్స్ల వారీగా సూచనలు చేశారు. ఈ నెలాఖరు దాటితే ఖాతాల్లోంచి నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. ‘నిధులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా వినియోగించుకోవాలి. ఎస్ఎంసీ కమిటీ తీర్మానం అవసరం. ఏ అవసరాలున్నా అందుబాటులో ఉన్న నిధులతో నెలాఖరులుగా సమకూర్చుకోవాలి. క్రీడా సామగ్రి కొనుగోలు చేయాలి. నిధుల వినియోగంపై శిక్షణ ఇచ్చామని’ డీఈఓ సోమశేఖర్శర్మ ‘న్యూస్టుడే’తో అన్నారు.
ఏఏ నిధులు ఎన్ని..
* మొత్తం పాఠశాలలు: 1,233
* నిర్వహణ గ్రాంట్లు: రూ.1.36 కోట్లు
* సీఆర్పీల (90) జీతభత్యాలు: రూ.14.85 లక్షలు
* ఎమ్మార్సీలకు(17)..: రూ.7.65 లక్షలు
* స్పోర్ట్స్ ఖర్చులు: రూ.1.11 కోట్లు
(నోట్: మధ్యాహ్న భోజన నిర్వహణ, ఏకరూప దుస్తుల కుట్టుకూలీ నిధులు విడుదలయ్యాయి..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.