సీతారాముల వారి పట్టువస్త్రాలు మాయం?
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సమర్పించిన పట్టు వస్త్రాల్లో కొన్ని మాయమైనట్లు తెలిసింది. శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాల తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా బయటకు పొక్కింది.
భద్రాచలం, న్యూస్టుడే
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సమర్పించిన పట్టు వస్త్రాల్లో కొన్ని మాయమైనట్లు తెలిసింది. శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాల తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా బయటకు పొక్కింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈఓ రమాదేవి అంతర్గతంగా విచారణ చేపట్టారు. కొద్దిరోజుల నుంచి లెక్కలను తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మార్చి 30న శ్రీరామనవమి, 31న శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులు కానుకలు సమర్పించారు. వేర్వేరు ఆలయాలు, పీఠాలు, మఠాల నుంచి రాములవారికి బహుమతులు అందాయి. ఇందులో ఓ ప్రముఖ మఠం నుంచి వచ్చిన సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు ఇప్పుడు కనిపించటం లేవన్నది సంచలంగా మారింది.
సంచిలో తీసుకెళ్లినవి డ్రైఫ్రూట్స్ కాదు..
ఎందుకు అనుమానం కలిగిందో కానీ తాము సమర్పించిన వస్త్రాలను చూపించాలని ఓ ప్రముఖ మఠం ప్రతినిధి ఇటీవల ఆలయ సిబ్బందిని కోరారు. సంబంధిత విభాగంలో పరిశీలించటంతో సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామికి సమర్పించిన వస్త్రాలు కనిపించలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ.. వారం క్రితం ఓ ఉద్యోగికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఒకరి తీరుపై అనుమానం వచ్చి నిగ్గదీసి అడిగారు. మార్చి 30న శ్రీరామనవమి రోజు డ్రైఫ్రూట్స్ తీసుకెళ్లినట్లు అతడు సమాధానమిచ్చారు. తీసుకున్నవి అప్పగిస్తే చర్యలు ఉండబోవని భరోసా కల్పించడంతో సదరు ఉద్యోగి.. తన బంధువులతో మార్చి 30న మామూలు వస్త్రాలను సంచిలో పెట్టి పంపించినట్లు ఒప్పుకొన్నారు. వీటిని రెండ్రోజుల క్రితం ఆలయానికి తిరిగి అప్పగించినట్లు తెలిసింది.
31న ఏం జరిగిందో తేలాలి..?
రాములవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను.. హక్కులు పొందిన గుత్తేదారు సేకరిస్తారు. వీటిని ప్రత్యేక కౌంటర్లో తిరిగి విక్రయిస్తుంటారు. గవర్నర్, ముఖ్యమంత్రి, పీఠాధిపతులు, మఠాధిపతులు వంటివారు సమర్పించినవి గుత్తేదారుకు ఇవ్వరు. వీటిని ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో దేవుడి అలంకరణకు భద్రపర్చుతుంటారు. ఈ విభాగంపై పర్యవేక్షణ కొరవడటంతో పుస్తకాల్లో నమోదు ప్రక్రియ గందరగోళంగా మారింది. దాతలు సమర్పించిన వాటినే భద్రపరిచారా..? వాటి స్థానంలో సాధారణ వస్త్రాలను ఉంచుతున్నారా అనే అనుమానం తెరపైకి వచ్చింది. 31న మాయమైన పట్టుచీరలు, పంచెలు, కండువాల గురించి ఆరా తీయడంతో 30న చోటుచేసుకున్న తంతు బయట పడింది. 31న సమర్పించిన పట్టువస్త్రాలు ఏమయ్యాయో తేలాలి. విచారణ పూర్తయ్యేసరికి ఇంకా ఎన్ని విచిత్రాలు వెలుగులోకి వస్తాయోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మామూలు వస్త్రాలను తీసుకెళ్లినవారు వాటిని అప్పగించారు. పట్టువస్త్రాలు మాయం కాలేదు. ఇప్పటికే ఇందులో ఒక చీర లభించింది. మిగతావి ఎక్కడ భద్రపరిచారో పరిశీలిస్తున్నాం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతాం.
రమాదేవి, ఈఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.