ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి.
వంగవీడు-సిరిపురం గ్రామాల మధ్య పూడ్చివేసిన సాగర్ కాల్వ
మధిర, మధిర పట్టణం, న్యూస్టుడే: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. దీంతో నీరు ప్రవహించక ఆయకట్టుకు నీరందడంలేదు. మరోవైపు పొలాలపై నీరు ప్రవహించడంతో ముంపునకు గురవుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మొక్కుబడిగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత భూమి అత్యంత విలువైనది.
వైరానది పాలవుతున్న సాగు నీరు
ఊటుకూరు మేజర్ 17వ కి.మీ. నుంచి 19వ కి.మీ. వరకు అసలు కాలువే లేకుండా పూడ్చివేసి రైతులు సాగుచేస్తున్నారు. దీంతో అడపాదడపా వచ్చే సాగునీరు వంగవీడు చెరువుకు చేరకుండా పంట పొలాలపై నుంచి ప్రవహించి వైరానది పాలవుతోంది. ఇలా ఏటా సాగునీరు వృథా అవుతోంది. అంతేకాకుండా పంట పొలాలపై నీరు ప్రవహించటం వల్ల రైతులు నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వంగవీడు, వెంకటాపురం, సిరిపురం గ్రామాలకు చెందిన పలువురు ఆయకట్టు, కౌలు రైతులు స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్కు ప్రజావాణిలో విజ్ఞప్తులు చేశారు.
నిధులు మంజూరైనా పునర్నిర్మాణంపై నిర్లక్ష్యం
రైతులు ఆక్రమించిన దాదాపు కిలోమీటరు నిడివిలో ఊటుకూరు మేజర్ను తిరిగి కాల్వగా తవ్వేందుకు ప్రభుత్వం రూ.9.93 లక్షల నిధులు మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు ఇచ్చి ఏడాది అవుతున్నా పనులు ప్రారంభించటం లేదు. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చి పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో అధికారులు చొరవచూపి ఆక్రమణకు గురైన కాల్వను తిరిగి తవ్వితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాలువ ఆక్రమణతో 22 మంది రైతులకు చెందిన 250 ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. సమస్య తీవ్రతను గుర్తించి నీటిపారుదలశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంది.
కానరాని ఆనవాళ్లు..
మధిర మేజర్ కాలువ చివరిలో ఉన్న దిడుగుపాడు సమీపంలో ఆక్రమణకు గురైంది. కొంత కాలువను ఆనవాళ్లు లేకుండా చేసి రియల్టర్లు ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఈ తంతు దశాబ్దంన్నర క్రితం జరిగింది. దీనిపై పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రాంత భూమి ఎకరం రూ.75 లక్షల నుంచి రూ.కోటి పలుకుతోంది. ఎన్నెస్పీని నీటిపారుదల శాఖ పరిధిలో విలీనం చేశారే కానీ అందుకు సంబంధించిన దస్త్రాలు, సమాచారాన్ని తమకు ఇవ్వలేదనే వాదన అధికారుల నుంచి వస్తోంది.
ఊటుకూరు మేజర్ చివరిలో కొంత ఆక్రమణకు గురైంది. దీన్ని పునర్నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. గతేడాది పనులు ప్రారంభించబోతే పైర్లు పాడవుతాయని రైతుల అభ్యర్థన మేరకు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ తొలగాక పనులు ప్రారంభిస్తాం. తొలకరిలో పంటలు సాగుచేయవద్దని ఇప్పటికే రైతులకు తెలియజేశాం. మధిర మేజర్ కబ్జాకు గురైన ప్రాంతాన్ని గుర్తించాం. అందరికి నోటీసులు ఇచ్చాం. ఓ రైతు హైకోర్టుకు వెళ్లినందున తీర్పు వచ్చాకనే తదుపరి చర్యలు తీసుకుంటాం.
నాగబ్రహ్మం, డీఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత