తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్టుడే: తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నామపత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో మొదటి ఓటు వేశానని, అందరివాడిగా తనను ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విభజన హామీలు, ప్రాజెక్టులు ఇతర సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశానన్నారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్లాల్, మేయర్ పునుకొల్లు నీరజ, నగర అద్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో ర్యాలీ.. అంతకుముందు నగరంలోని నామా నాగేశ్వరరావు తన ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడికి చేరుకున్న నాయకులతో కాసేపు ముచ్చటించారు. అక్కడ నుంచి వైరారోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు భారాస నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు చరమగీతం పాడాలి
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు. -
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్