logo

తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా

తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.

Published : 25 Apr 2024 02:43 IST

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం నామపత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో మొదటి ఓటు వేశానని, అందరివాడిగా తనను ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విభజన హామీలు, ప్రాజెక్టులు ఇతర సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశానన్నారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్‌ మదన్‌లాల్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, నగర అద్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో ర్యాలీ.. అంతకుముందు నగరంలోని నామా నాగేశ్వరరావు తన ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడికి చేరుకున్న నాయకులతో కాసేపు ముచ్చటించారు. అక్కడ నుంచి వైరారోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు భారాస నాయకులు,  ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని