గిరిజనులకు అండ.. కాషాయ జెండా
కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
కొత్తగూడెంలో అభివాదం చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చిత్రంలో ప్రేమేందర్రెడ్డి, ధర్మారావు, పొంగులేటి సుధాకర్రెడ్డి, తాండ్ర వినోద్రావు, కేవీ రంగాకిరణ్, న్యాయవాది రమణారెడ్డి తదితరులు
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. గిరిజనుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమపై అభిమానంతో ఎండను లెక్కచేయక ప్రజలు సభకు తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో భాజపా అభ్యర్థులు తాండ్ర వినోద్రావు, అజ్మీరా సీతారాంనాయక్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తనపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు ప్రధాని మోదీని విమర్శిస్తున్నారంటూ పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే భాజపాపై బురద జల్లుతోందని, అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఒక్క అసెంబ్లీ సీటు కోసం సీపీఐ నాయకులు తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. వియ్యంకుడి హోదాలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని ఓట్లు అడగటానికి వచ్చే వలసవాదుల చేతిలో ప్రజలు మోసపోవద్దని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. గతంలో ఎందరో నాయకులు పాలించినా చెప్పుకోదగిన విద్య, వైద్యసంస్థలు రాలేదని తెలిపారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి మార్తినేని ధర్మారావు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రంగాకిరణ్, గల్లా సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు.
భాజపా జనసభకు తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
[ 17-05-2024]
పాత లింగాల గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు కోరం కనకయ్య, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి సమక్షంలో గరిడేపల్లి మాజీ సర్పంచ్ బోడ రాంజీ నాయక్ కాంగ్రెస్లో చేరారు. -
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది
[ 17-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ సెంటర్లో భారాస ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు
-
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు