ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముగిసిన మొదటి, రెండో విడత పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై వివిధ పార్టీలు ఈసీఐ విధానాన్ని ప్రశ్నించాయి. తొలి విడత (ఏప్రిల్ 19), రెండో విడత (ఏప్రిల్ 26) పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా మంగళవారం ప్రకటించింది. తొలి విడత పోలింగ్ ముగిసిన పదకొండు రోజుల తర్వాత తుది వివరాలు వెల్లడించటంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది అధికార భాజపాకు మేలు చేసేందుకేనని పరోక్షంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల అధికారులు మాత్రం ఈవీఎంలలో పొరపాట్లు జరగటానికి ఆస్కారమే లేదంటున్నారు. పోలింగ్ శాతం వెల్లడిలో ఆలస్యమైనంత మాత్రాన పోలైన ఓట్లపై ప్రభావం ఉండబోదని చెబుతున్నారు.
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకం. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై పలుమార్లు రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేశాయి. వాటి పనితీరుపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈవీఎంలు పారదర్శకంగా పనిచేస్తాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఓటేసేందుకు వినియోగించే ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు సమక్షంలో వివిధ దఫాల్లో పరిశీలిస్తామంటున్నారు. పోలింగ్ ముగిశాక కట్టుదిట్టమైన భద్రత నడుమ వాటిని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తామని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ఠ బందోబస్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రత సిబ్బంది కనుసన్నల్లో స్ట్రాంగ్ రూమ్లు ఉన్నప్పుడు అవకతవకలకు ఆస్కారం లేదని చెబుతున్నారు.
పారదర్శకంగా వీవీప్యాట్ చీటీల లెక్కింపు
ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చే విధానాన్ని ఈసీ అనుసరిస్తోంది. లోక్సభ స్థానం పరిధిలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఏదైనా ఒక కంట్రోల్ యూనిట్ను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. వీటిని లెక్కించటానికి ప్రత్యేక టేబుల్ సమకూర్చుతారు. లెక్కింపు ప్రక్రియ సంబంధిత ఆర్ఓ లేదా ఏఆర్ఓ పర్యవేక్షణలో జరుగుతుంది. సీయూలోని ఓట్లు, వీవీప్యాట్ స్లిప్ల మధ్య వ్యత్యాసం ఉంటే వీవీప్యాట్లను ఒకటికి రెండుసార్లు లెక్కిస్తారు. చివరికి వీవీప్యాట్ స్లిప్లనే ప్రామాణికంగా తీసుకుని తుది ఫలితాలను ఆర్ఓ వెల్లడిస్తారు. ఒకదాని తర్వాత మరొక వీవీప్యాట్ స్లిప్లను లెక్కిస్తారు.
వ్యత్యాసం ఉండదు
పోలింగ్ ముగిశాక ప్రిసైడింగ్ అధికారి చట్టబద్ధమైన ఫాం-17(సీ)లో పోలైన ఓట్ల వివరాలను నమోదుచేస్తారు. ఫాం-17(సీ) రెండు భాగాలను కలిగి ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లను లెక్కించి ఫాం-17(సీ)లోని మొదటి పార్టులో పొందుపరుస్తారు. రెండో పార్టును ఓట్ల లెక్కింపు రోజు వినియోగిస్తారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ఏజెంట్ సదరు పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలతో కూడిన ఫాం-17(సీ) ఒరిజినల్ కాపీ పొందవచ్చు. ఇది ఓట్ల లెక్కింపు రోజు అభ్యర్థికి ఉపయోగపడుతుంది. అంతకుముందు ఫాం-17ఏ (ఓటర్ల రిజిస్టర్)లో నమోదైన ఓట్లు, ఫాం-17(సీ)లో ప్రస్తావించిన వివరాలు సరిపోలితేనే ఏజెంట్లు పీఓ ఇచ్చే ధ్రువపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిశాక ఈవీఎంలకు ఫాం-17(ఏ), 17(సీ) కాపీలు జతపరిచి సీల్ వేసి స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తామని అధికారులు చెబుతున్నారు. తద్వారా పోలైన ఓట్లకు ఈవీఎంలోని ఓట్లకు వ్యత్యాసం వచ్చే అవకాశం లేదంటున్నారు. టెండర్ ఓట్లను ఫాం-17(బీ)లో నమోదుచేస్తారు.
ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్
పోలింగ్ ప్రారంభానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఉపయోగిస్తున్న బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని ప్రిసైడింగ్ అధికారి అక్కడి ఏజెంట్లకు చూపిస్తారు. ఈవీఎంలలో అంతకుముందు ఓట్లు దాగిలేవని ఏజెంట్లను పీఓ సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత పోలింగ్ కేంద్రానికి కేటాయించిన సీయూ(కంట్రోల్ యూనిట్)లో రిజల్ట్ బటన్ నొక్కటం ద్వారా అందులో ఇదివరకే నమోదైన ఓట్లు ఏమీ లేవని ధ్రువీకరిస్తూ ఏజెంట్ల ముందు ప్రదర్శిస్తారు. ఆతర్వాతే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి