సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల నామపత్రాల సమర్పణ, ఉపసంహరణ క్రతువు ముగియటంతో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఇప్పటికే శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను అధికారులు కేటాయించారు. ఖమ్మం లోక్సభ స్థానంలో అభ్యర్థులు అధిక సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా ఈవీఎంలను తెప్పించారు. వీటినీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎఫ్ఎల్సీ(మొదటి దశ తనిఖీ)తో పాటు తొలి, రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు. మరోవైపు పోలింగ్ సిబ్బంది, సూక్ష్మపరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేసిన అధికారులు ఈనెల 13న జరిగే పోలింగ్కు సమాయత్తమవుతున్నారు.
అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ గౌతమ్
‘ఖమ్మం’లో మూడు, ‘మహబూబాబాద్’కు రెండు బ్యాలెట్ యూనిట్లు
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి 35 మంది, మహబూబాబాద్ స్థానానికి 23 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి గరిష్ఠంగా 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. ఈలెక్కన ఖమ్మం లోక్సభ స్థానంలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్కు రెండు బ్యాలెట్ యూనిట్లు కావాలి. వీటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ అవసరం. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అధికారులు కొన్ని ఈవీఎంలను సిద్ధం చేసి మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ముగించారు. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా ఖమ్మం జిల్లాకు 2,200, భద్రాద్రి జిల్లాకు 1,700 బ్యాలెట్ యూనిట్లను అదనంగా కేటాయించారు. పోలింగ్ రోజు సాంకేతిక సమస్యలు తలెత్తినా అంతరాయం కలగకుండా 25 శాతం బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం వీవీప్యాట్లను అదనంగా అందుబాటులో ఉంచారు.
సాంకేతిక నిపుణుల నియామకం
పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా అధికారులు శాసనసభ నియోజకవర్గాల వారీగా అదనపు ఈవీఎంలను కేటాయించారు. వీటిని పోలింగ్ రోజు ఆయా సెగ్మెంట్లలో విధులు నిర్వర్తించే సెక్టోరల్ అధికారులకు అప్పగించనున్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే వేరే వాటిని సెక్టోరల్ అధికారులు అమర్చుతారు. ఇలా ఒక్కో సెక్టోరల్ అధికారికి 2-3 ఈవీఎంలను అధికారులు అప్పగిస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున సాంకేతిక నిపుణులను ఈసీ నియమించింది. ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే సాంకేతిక నిపుణులు వెంటనే సరిచేస్తారు. వినియోగానికి వీలు పడకుంటే వేరే ఈవీఎం అమర్చుతారు.
ముగిసిన రెండో విడత ర్యాండమైజేషన్
ఇప్పటికే మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తైన ఈవీఎంలను అదనంగా అవసరమైన ఈవీఎంలకు కలిపి రెండో విడత ర్యాండమైజేషన్ ముగించిన అధికారులు వాటిని పటిష్ఠ భద్రత మధ్య శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. పోలింగ్ కంటే ముందు మూడో విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల జాబితా ప్రకారం ఇటీవల బ్యాలెట్ పేపర్ ముద్రించారు. ప్రస్తుతం ఈ పేపర్ను బ్యాలెట్ యూనిట్లలో పొందుపరుస్తున్నారు.
మధిరలో ఈవీఎంల కమిషనింగ్
మధిర గ్రామీణం, న్యూస్టుడే: ఖాజీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంల కమిషనింగ్ను కలెక్టర్ గౌతమ్ ఆదివారం చేపట్టారు. ఈవీఎం పరికరాల సన్నద్ధతను పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన గదులను తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ మధు, గ్రామీణ ఎస్సై లక్ష్మీభార్గవి, గిర్దావర్ జయకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్కూరు సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన