జగన్కో దండం.. వచ్చారంటే గండం
సారొస్తున్నారంటే.. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిందే. అత్యవసరమైనా.. ఆపదలో ఉన్నా.. అవస్థలు పడుతున్నా.. సామాన్య ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆయనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు.
సీఎం పర్యటించే దారుల్లో వాహనాల అడ్డగింత
తుగ్గలి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆగిపోయిన వందలాది వాహనాలు
పత్తికొండ, తుగ్గలి, న్యూస్టుడే: సారొస్తున్నారంటే.. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిందే. అత్యవసరమైనా.. ఆపదలో ఉన్నా.. అవస్థలు పడుతున్నా.. సామాన్య ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆయనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయినా.. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినా.. అవేమీ పట్టించుకోరు. ఇదీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనలో తరచూ ఎదురయ్యే పరిస్థితి. ఎమ్మిగనూరు సభ ముగించుకుని పత్తికొండ చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు తుగ్గలి వద్ద ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ముఖాముఖికి సీఎం పది గంటలకు రావాల్సి ఉండగా 12 గంటలకు చేరుకున్నారు. తుగ్గలి- మద్దికెర, తుగ్గలి- పత్తికొండ, తుగ్గలి- గుత్తి మార్గాల్లో వందలాదిగా తరలివచ్చిన పోలీసులు నాలుగు గంటల పాటు వాహనాలను నిలిపివేశారు. మండే ఎండలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు, దూరం వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతూ.. అసహనం వ్యక్తం చేశారు.
వాహనాలను ఆపేస్తున్న పోలీసులు
చుట్టూ 20 కి.మీ. పోలీసులే
పరదాల నుంచి ప్రజల్లోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఆయన నిర్వహించే సభ చుట్టూ 20 కి.మీ. దూరం మేర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్తికొండ, తుగ్గలి పర్యటన దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నుంచే మద్దికెర వద్ద పోలీసులు పికెట్ నిర్వహించారు. జిల్లా సరిహద్దు బసినేపల్లి వద్ద, పత్తికొండ వద్ద అడుగడుగునా కి.మీ. మేర పోలీసులు కాపలా కాస్తూనే ఉన్నారు. మండిపోతున్న ఎండలకు ఓ వైపు పోలీసులు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాహనదారులు నలిగిపోయారు.
వలస కూలీల విలవిల
తుగ్గలి మండలం పగిడిరాయికు చెందిన పలువురు కూలీలు వలసవెళ్లి తిరిగి వస్తూ.. తుగ్గలి వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి సభ సమీపంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. గంటల సేపు ఎండకు తాళలేక వారు నెత్తిపై పట్టాలు కప్పుకొని కూర్చున్నారు. వాహనంలోని మహిళలు వడదెబ్బకు గురైనట్లు సమాచారం.
చిన్నారికి బస్సులోనే ఊయల కట్టి
ఆర్టీసీ బస్సులో ఆదోని నుంచి అనంతపురం వెళ్తున్న ఓ మహిళ గంటల సేపు బస్సు మధ్యలోనే పోలీసులు నిలిపివేయడంతో తన కుమార్తెకు బస్సులోనే ఊయల కట్టి ఊపారు. బస్సులో వేడికి పాప ఇబ్బంది పడుతోందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెప్పాపెట్టకుండా బస్సులు, ఇతర వాహనాలు నిలిపేస్తే ప్రయాణాలు సాగించే చిన్నారులు, వృద్ధులు, మహిళల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
నాలుగు గంటలు నరకం చూశా
మహానంది, డ్రైవర్
పోలీసులు తుగ్గలి వద్ద వాహనం నిలిపివేయడంతో నాలుగు గంటల పాటు నరకం చూశా. సరకుల వాహనంతో మంత్రాలయం నుంచి అనంతపురం వెళ్తున్నా. ఉదయం 9.30 గంటలకు తుగ్గలి మండల పరిషత్ కార్యాలయం వద్ద మా వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. మధ్యాహ్నం 1.30 గంటలు దాటినా.. వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ దారుల్లో వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక మింగారు.. కాలుష్యం నింపారు
[ 22-05-2024]
రాయలసీమ జీవనదిగా పేరొందిన తుంగభద్ర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సుంకేసుల జలాశయానికి అతి సమీపంలో నది లోపల బోట్ల సాయంతో (డ్రెడ్జింగ్) ఇసుకను తోడేశారు.. నాలుగేళ్లుగా జలాశయం వెనుక జలాల్లో భారీ ఎత్తున ఇసుక తవ్వేశారు. -
కుందూ మన్ను.. అక్రమార్కుల కన్ను
[ 22-05-2024]
కుందూ తీరంలో మాఫియా మన్ను బుక్కుతోంది.. నది వెంట 20 కి.మీల పొడవున ఆయా గ్రామాల్లో పలుచోట్ల పొక్లెయిన్లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తున్నారు. -
చెమ్మగిల్లిన చెరువు
[ 22-05-2024]
నీటి వనరులు ‘చిన్న’బోతున్నాయి.. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించలేక, నిధులివ్వక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి చెరువులపైనా శీతకన్నేసింది. -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 22-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. -
పత్తి చేనులో గంజాయి సాగు
[ 22-05-2024]
కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఆరా తీయడంతో డొంక కదిలింది. -
ఆటల్లో సత్తా.. గురుకులంలో సీటు
[ 22-05-2024]
గురుకుల విద్యాలయం పేద విద్యార్థుల ఆశా కిరణంగా నిలిచింది. ఇందులో సీటు రావాలంటే పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. కొంత మంది క్రీడాకారులు ఆటల్లో చూపిన ప్రతిభతో క్రీడా కోటా కింద సీటు పొందారు. -
తేరుపై జ్వాలా నృసింహుని విహారం
[ 22-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలతో ఎగువ అహోబిలం ఉత్సవ శోభను సంతరించుకుంది. స్వామి నిత్య అలంకృతుడై వాహనాలపై దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. -
నీటి పరీక్ష కిట్లకు.. కటకట
[ 22-05-2024]
ప్రజలు అనారోగ్యానికి గురవడానికి ప్రధాన కారణం నీరు కలుషితం కావడమే. జిల్లాలో చాలా ప్రాంతాలలో నీరు కలుషితం కావడంతో అతిసారంతో మరణాలు సంభవించడంతో పాటు, పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. -
విజ్ఞాన వేదిక.. వినోదాల కానుక
[ 22-05-2024]
ప్రస్తుతం బాలలకు చరవాణే ప్రపంచం.. పుస్తక పఠనం మరిచారు.. ఆటపాటల ఊసే లేదు.. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు గ్రంథాలయ సంస్థ వేసవి వినోదానికి శ్రీకారం చుట్టింది. -
నగర నగిషీలు.. నగుబాటు
[ 22-05-2024]
కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కూడళ్లలో సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. గతంలో పలు ప్రాంతాల్లో బొమ్మలు, పచ్చదనం ఉండేలా కూడళ్లను తీర్చిదిద్దారు, ప్రస్తుతం వాటిని తొలగంచి మళ్లీ పనులు చేస్తున్నారు. -
సంక్షేమం కాదు.. తలపై గండం
[ 22-05-2024]
కర్నూలు నగరంలోని సంక్షేమ భవనం పెచ్చులూడి చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లేకపోవడం, మరమ్మతులు అసలే చేపట్టకపోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. -
నంద్యాల పట్టణంలో నాకాబందీ
[ 22-05-2024]
ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. -
బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలు మాయం
[ 22-05-2024]
ఆత్మకూరు పట్టణంలోని రహ్మత్నగర్కు చెందిన పెయింటర్ షేక్ మహబూబ్బాషా బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు చోరీకి గురయ్యాయి.