logo

తెదేపాలో చేరికలు

ఆదోని పట్టణంలో 3వ వార్డు బసన్న కట్ట, గోకర్ జెండా ప్రాంతానికి చెందిన 150 మంది వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరారు.

Published : 02 May 2024 16:03 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణంలో 3వ వార్డు బసన్న కట్ట, గోకర్ జెండా ప్రాంతానికి చెందిన 150 మంది వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరారు. ఆదోని తెదేపా ఇన్‌ఛార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు సమక్షంలో పార్టీలో  చేరారు. వీరికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ ఛైర్మన్ దేవేంద్రప్ప, రామస్వామి, బుద్ధారెడ్డి, మారుతీ రావు, నాయకులు మారుతి నాయుడు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని