logo

ప్రచార భేరి

ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్‌, నాయకులు పాల్గొన్నారు.

Published : 03 May 2024 04:00 IST

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్‌, నాయకులు పాల్గొన్నారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోనిలో 3వ వార్డు బసవన్న కట్ట, గోకర్‌జెండా ప్రాంతానికి చెందిన 150 కుటుంబాలు, కార్వన్‌పేట బండి మాబాషా ఆధ్వర్యంలో 13వ వార్డు కౌడల్‌పేటకు చెందిన 50 మైనారిటీ కుటుంబాలు తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు, ఉమాపతినాయుడు సమక్షంలో గురువారం వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో నాయకులు దేవేంద్రప్ప, రామస్వామి, అప్సర్‌బాషా, బుద్ధారెడ్డి, వెంకటేశ్‌, శివప్ప, తిమ్మప్ప, మారుతీనాయుడు, సైదుల్లా, మాబాషా పాల్గొన్నారు.  


తుగ్గలి, న్యూస్‌టుడే: తుగ్గలితో పాటు బొందిమడుగుల, నునుసరాల్ల, మారెల్ల, ముక్కెళ్ల, రామకొండ, పెండేకల్లు, ఎద్దులదొడ్డి గ్రామాల్లో పత్తికొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, తిమ్మయ్యచౌదరి, మనోహర్‌చౌదరి, తిరుపాల్‌నాయుడు, రాముడు, రామాంజనేయులు, వెంకటరాముడు, వీరేశ్‌, చంద్ర, శ్రీనివాసులు, ప్రతాప్‌ పాల్గొన్నారు.


కృష్ణగిరి, న్యూస్‌టుడే: మండలంలోని సంగాల, చిట్యాల గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి కేఈ శ్యాంబాబు, పార్లమెంట్‌ అభ్యర్థి నాగరాజుకు మద్దతుగా ఆ పార్టీ నాయకుడు కేఈ వేణుబాబు, కేఈ నందీశ్‌ గురువారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెర్నేకల్‌ (దేవనకొండ) న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపేట, కుంకనూరు, పాలకుర్తి, గుమ్మరాళ్ల, కరిడికొండ, తెర్నేకల్‌ గ్రామాల్లో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకప్ప, బొజ్జమ్మ, విజయ్‌భాస్కర్‌, ఉచ్చీరప్ప, వెంకటరాముడు, రంగన్న, లక్ష్మన్న, కర్రెన్న, రాజాసాబ్‌, మలకన్న, మల్లయ్య, రామారావు పాల్గొన్నారు.


హొళగుంద, న్యూస్‌టుడే: సమ్మతగేరి, మునానుగుంది, సుళువాయి గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థులు ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్‌ను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు శివప్రకాశ్‌, సీతయ్య, వీరన్నగౌడ, రాజశేఖరగౌడ్‌, గవిగౌడ గురువారం ఇంటింటి ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని