logo

మాదిగలను మోసం చేసిన వైకాపాకు బుద్ధి చెప్పాలి: మంద కృష్ణ మాదిగ

రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నిర్వహిస్తున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 07 May 2024 06:12 IST

కంబళదిన్నెలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నిర్వహిస్తున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అనేక మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. మాదిగలను మోసం చేసిన వైకాపాను ఓడించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు