logo

జగన్‌ను సాగనంపుదాం

నవరత్నాల పేరుతో మోసగించిన జగన్‌ను ఇంటికి సాగనంపి  చంద్రబాబుకు పట్టం కట్టాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Published : 08 May 2024 01:56 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నవరత్నాల పేరుతో మోసగించిన జగన్‌ను ఇంటికి సాగనంపి  చంద్రబాబుకు పట్టం కట్టాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రజలను నవ మోసాలతో ముంచేసిందన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో జగన్‌ ఓడించేందుకు ప్రజల సిద్ధం కావడంతో దానిని గ్రహించిన జగన్‌ ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నారని తెలిపారు. వైకాపా నాయకుల అక్రమాలపై జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు, ఎస్పీకి విన్నవించామన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు