వెలుగోడు రైతులకు జగన్ ఉరి
కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు.
కడపకు తరలింపు
తెలుగు గంగకు నీళ్లివ్వని వైనం
నాలుగేళ్లుగా రెండో పంట ఎండబెట్టారు
నంద్యాల పట్టణం, వెలుగోడు న్యూస్టుడే: కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు. 1993 నుంచి వెలుగోడు జలాశయం ద్వారా తెలుగుగంగ జలాలు నేల తాకుతుండగా.. 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక కారు పంటకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. ఇదే క్రమంలో పక్క జిల్లా ప్రజాప్రతినిధుల మెప్పు పొందడానికి గుట్టుచప్పుడు కాకుండా సాగునీటిని ఇతర జిల్లాలకు తరలించడంతో ఈ ప్రాంత రైతులు విలవిల్లాడిపోతున్నారు.
16 టీఎంసీలు.. 70 వేల ఎకరాలు
శ్రీశైలం వెనకజలాలను పోతిరెడ్డి పాడు నుంచి వెలుగోడు జలాశయంలోకి తరలిస్తారు. 16 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. 70 వేల ఎకరాల్లో వరి, అరటి, మినుము, పొగాకు, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేస్తారు. ఎగువ నుంచి జల పరవళ్లు లేకపోవడంతో తొమ్మిది టీఎంసీలు నిల్వ చేయలేని పరిస్థితి. వారబందీ పద్ధతి (15 రోజులకోసారి)లో నీటిని విడుదల చేశారు. ఏడు విడతల్లో 1,14,500 ఎకరాలకు సాగునీటిని అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడి పంటలను ఎండబెట్టి రెండు టీఎంసీల నీటిని పొరుగు జిల్లాకు తరలించారని రైతులు మండిపడుతున్నారు.
లైనింగ్ పేరుతో బురిడీ
రెండేళ్లలో పూర్తి చేయాల్సిన లైనింగ్ పనులు సా..గుతున్నాయి. ఆలస్యానికి జరిమానా వేయకుండా అదనంగా బిల్లులు చెల్లించడం గమనార్హం. లైనింగ్కు మొదట రూ.239 కోట్లు కేటాయించిన ఆ మొత్తాన్ని రూ.500 కోట్లకు పెంచి పాత గుత్తేదారునికే పనులు అప్పగించింది. . ఇప్పటికీ రెండో పంట నష్టపోతున్నారు. నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం (నీటి ఆవిరి, వృథాలు కలిపి) ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాలు పండిండొచ్చు. గత నాలుగేళ్లులో 40 వేల ఎకరాల్లో పంట వేయలేకపోయారు.
రెండు టీఎంసీలు ఎక్కడికెళ్లినట్లు
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగోడు జలాశయంలో ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అందులో నంద్యాల, ఆళ్లగడ్డ పట్టణాలకు మంచినీటి అవసరాలకు 1 టీఎంసీ వినియోగించారు. డెడ్స్టోరేజ్ కింద 1 టీఎంసీని నిల్వ చేయాల్సి ఉంటుంది. అప్పటికే 1 టీఎంసీ నీటిని పంటలకు అందించారు. మిగిలిన రెండు టీఎంసీల నీటిని విడతల వారీగా పొరుగు జిల్లాకు తరలించారు. వెలుగోడు జలాశయం నుంచి కేసీ కెనాల్ ద్వారా గాలేరు నగరి మీదుగా సీఎం సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో వెలుగోడులో మూడు టీఎంసీల నీరు ఉన్న సమయంలోనే తెలుగుగంగ, కేసీ కాల్వ కింద రెండు పంటల్ని రైతులు పండించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సాగునీటి విడుదలలో విఫలమయ్యారని వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల రైతులు వాపోతున్నారు.
నాలుగేళ్లుగా రెండో పంటకు నీరేదీ
తెలుగుగంగ జలాశయం ద్వారా వెలుగోడు మండలంలో నాలుగు వేల ఎకరాలు, బండి ఆత్మకూరులో 12 వేలు, మహానందిలో మూడు వేలు, రుద్రవరం 25 వేలు, ఆళ్లగడ్డ 25 వేలు, చాగలమర్రి మండలంలో 26 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధాన కాల్వ లైనింగ్ పేరుతో 2020 నుంచి రెండో పంటకు (రబీ) నీరు ఇవ్వడం లేదు. లైనింగ్ పనులు పేరిట సాగు నీటిని విడుదల చేపట్టకపోవడంతో ఈర్నపాడు, సోమయాజులపల్లె, వెంగళరెడ్డిపేట, శింగవరం, నారాయణాపురం, చిన్నదేవళాపురం, జీసీపాలెం గ్రామాల్లో పొలాలు బీళ్లుగా మారాయి. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం, రేగడగూడూరు, వేల్పనూరు, బండిఆత్మకూరు మండలం యర్రగుంట్ల గ్రామాల్లో రెండో పంట కింద సాగు చేసిన మెట్టపంటలకు నీరు అందకపోవడంతో దెబ్బతిన్నాయి. కేసీ కెనాల్లో మోటార్లు పెట్టుకుని నీటిని తీసుకెళ్తే అధికారులు పైపులు ధ్వంసం చేశారు.
ఆర్థికంగా చితికిపోయారు
- పాశశంకర్, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు
మూడేళ్ల నుంచి రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఖరీఫ్లో సాగు చేసే వరికి అధిక చీడపీడలు వస్తాయి. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గుతాయి. రైతులకు ఖరీఫ్లో ఖర్చులు, కౌలు పోగా పెద్దగా మిగలదు. రబీలో సాగు చేసే వరిపంటకు చీడపీడలు తక్కువగా ఉండటంతో దిగుబడులు పెరిగి...రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రబీకి సాగునీరు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి తలకిందులైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
[ 19-05-2024]
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
టిడ్కో ఇళ్లలో పోలీసుల సోదాలు
[ 19-05-2024]
పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డులో ఉన్న ప్రభుత్వ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన