logo

గెలిపిస్తే నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తా..

సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు  ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మిగనూరు నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నియోజవర్గ తెదేపా ఎమ్మెల్యే  అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 12:55 IST

గోనెగండ్ల: సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు  ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మిగనూరు నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నియోజవర్గ తెదేపా ఎమ్మెల్యే  అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె, ఐరన్ బండ,పెద్దనెలటూరు, కులుమాల చిన్ననేలటూరు గ్రామాల్లో ‘మన ఊరు - మన బీవీ ’ పేరుతో  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో  భాగంగా  ఎమ్మిగనూరు నియోజకవర్గంలో  పర్యటించారు.  ఇంటింటికి  తిరుగుతూ  తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.  ఈ కార్యక్రమంలో  మండల కన్వీనర్  నజీర్ సాహెబ్, హనుమంతు, తిరుపతయ్య, బేతాళ బడేసా, రామాంజనేయులు,  చంద్రశేఖర్, రంగస్వామి నాయుడు , వెంకటేష్, శ్రీధర్, షేక్షావలి, ఫక్రుద్దీన్, డాక్టర్ నూరా, భాజపా , జనసేన నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు