logo

సున్నిపెంటలో తెదేపా ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా,  జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్‌ షో నిర్వహించారు.

Published : 10 May 2024 12:36 IST

సున్నిపెంట సర్కిల్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా,  జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్‌ షో నిర్వహించారు. శ్రీశైలం తెదేపా సమన్వయకర్త యుగంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు  సున్నిపెంటలోని తెదేపా పార్టీ కార్యాలయం నుంచి రోడ్‌ షోను ప్రారంభించారు.  కాకులసెంటర్‌, బండ్లబజార్‌, మార్కెట్‌,ఆశ్రమం, అక్కమ్మసెంటర్‌, బస్టాండ్‌ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోడ్‌ షోలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  రాజశేఖర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి భైరెడ్డి శబరిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెదేపా, భాజపా, జనసేన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని