వివాహేతర సంబంధానికి దారి తీసిన అప్పు.. సినీ ఫక్కీలో ప్రియురాలి భర్త హత్య
అప్పు తీసుకున్న సందర్భంగా మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడం అతను అమలు చేసిన ప్రణాళిక ఓ క్రైం సినిమాను తలపిస్తోంది. మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ శుక్రవారం
పోలీసులు స్వాధీనం చేసుకున్న హత్యకు ఉపయోగించిన రాడ్, చరవాణులు
జడ్చర్ల న్యూటౌన్, న్యూస్టుడే : అప్పు తీసుకున్న సందర్భంగా మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడం అతను అమలు చేసిన ప్రణాళిక ఓ క్రైం సినిమాను తలపిస్తోంది. మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ శుక్రవారం జడ్చర్లలో విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్ల మండలంబూర్గుపల్లికి చెందిన శ్రీశైలం (29)కు తొమ్మిదేళ్ల కిందట హైదరాబాద్లోని తిలక్నగర్ ప్రాంతానికి చెందిన సంగీతతో వివాహమైంది. ఈమె తల్లి నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గ్రామానికి చెందిన వెంకటమ్మ సుమారు 20 ఏళ్ల కిందట హైదరాబాద్కు వెళ్లి జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తోంది. 2016లో శ్రీశైలం జీవనోపాధి కోసం భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఎల్బీనగర్ రత్నానగర్లో అద్దె ఇంట్లో ఉంటూ కారు డ్రైవర్గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య సంగీత ఎదురింట్లో ఉండే విక్రం వద్ద రూ.50 వేలు అప్పు తీసుకుంది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన శ్రీశైలం మరో ఇంట్లోకి మారినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గత సంవత్సరం కుటుంబాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి, కూలీ పనులు చేసుకుంటున్నారు.
స్నేహితుడిని బంధువుగా పంపి : సంగీత దగ్గర చరవాణి లేకపోవడంతో సంబంధాన్ని కొనసాగించడం కోసం ఆమె సహకారంతో విక్రం తన స్నేహితుడు రాజును ఆమె దూరపు బంధువుగా నాలుగు నెలల కిందట వారి ఇంట్లో మకాం వేయించాడు. అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రియురాలి సాయంతో ఆమె భర్త శ్రీశైలంను హతమార్చాలని పథకం పన్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇనుప రాడ్ను చేయించాడు. గత నెల 31న ప్రత్యేకంగా ఒక ద్విచక్ర వాహనాన్ని, కొత్త దుస్తులను కొన్నాడు. మద్యంసీసా, కారం పొడి ప్యాకెట్ తీసుకుని అదేరోజు రాత్రి పది గంటల సమయంలో బూర్గుపల్లి సమీపంలో ఉన్న కిష్టంపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ ఓ దుకాణంలో మంచినీళ్ల బాటిల్ కొన్నాడు. దుకాణ యజమాని చరవాణితోనే తన స్నేహితుడైన రాజుకు ఫోన్ చేసి.. సంగీత తల్లి వెంకటమ్మ రూ.50 వేలు ఇచ్చి పంపిందని, తాను ఊరిబయట ఉన్నానని వచ్చి తీసుకెళ్లాల్సిందిగా శ్రీశైలంను నమ్మించి తీసుకురావాలని చెప్పాడు. రాజు మాటలు నమ్మిన శ్రీశైలం అతని వెంట ఊరి బయటకు వచ్చి మద్యం తాగుతుండగా విక్రం తరవాత అక్కడికి చేరుకున్నాడు. శ్రీశైలం కళ్లలో కారం చల్లి, ప్రత్యేకంగా చేయించిన ఇనుప రాడ్డుతో తలపై మోది హతమార్చాడు. అనంతరం రాజు తిరిగి బూర్గుపల్లికి వెళ్లగా.. విక్రం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్కు వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం రోడ్డు పక్కన శ్రీశైలం మృతదేహాన్ని గుర్తించారు. అతడి చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు సంగీత, వారి ఇంట్లో ఉంటున్న రాజుపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నిందితుడు విక్రం, హత్య కుట్రకు సహకరించిన సంగీత తల్లి వెంకటమ్మ శుక్రవారం జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి దగ్గర ఉండగా అదుపులోకి తీసుకొని విచారించామని, హత్య కేసును ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులు నలుగురిని రిమాండ్కు తరలించామన్నారు. సీˆఐలు రమేష్బాబు, జములప్ప, ఎస్సైలు రాజేందర్, జయప్రసాద్, సిబ్బంది బాలు, శంకర్, రమేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గద్వాలలో భాజపా బహిరంగ సభ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఈ నెల 4న గద్వాల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
[ 02-05-2024]
పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
వంతెన పనులు పూర్తి చేయాలి
[ 02-05-2024]
అయిజ పట్టణంలోని పెద్దవాగుపై రెండేళ్లుగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. -
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్