logo

మహిళ దారుణ హత్య

మండలకేంద్రానికి చెందిన పురుగుల లక్ష్మమ్మ(48) దారుణహత్యకు గురైనట్లు ఎస్సై అభిషేక్‌రెడ్డి తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. నవాబ్‌పేట గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు..

Published : 16 Apr 2024 03:02 IST

లక్ష్మమ్మ

నవాబ్‌పేట, న్యూస్‌టుడే : మండలకేంద్రానికి చెందిన పురుగుల లక్ష్మమ్మ(48) దారుణహత్యకు గురైనట్లు ఎస్సై అభిషేక్‌రెడ్డి తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. నవాబ్‌పేట గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి చుట్టు ప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వెళ్లి చూడగా శవం కుళ్లిపోయి కనిపించినట్లు చెప్పారు. ఈ హత్య నాలుగురోజుల క్రితం జరిగి ఉండవచ్చని వివరించారు. రూరల్‌ సీఐ గాంధీనాయక్‌ సమక్షంలో క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌లను పిలిపించి ఆధారాలను సేకరించినట్లు తెలియజేశారు. మృతురాలి కుమారుడు హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి కోడలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని