logo

కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయండి

న్యాయవాదులు కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ...

Published : 16 Apr 2024 03:33 IST

న్యాయవాదులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : న్యాయవాదులు కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేడ్కర్‌ అంబేడ్కర్‌ జీవితాన్ని నేటితరం తెలుసుకుని స్ఫూర్తి పొందాలన్నారు. బాబాసాహెబ్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఒక న్యాయవాదులు కక్షిదారులకు సత్వరం న్యాయం అందేలా కృషి చేయాలన్నారు. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్‌.శ్రీదేవి, సంధ్యారాణి, ఎస్‌శ్రీదేవి, చైతన్య, భావన, న్యాయవాద పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు యోగేశ్వర్‌ రాజ్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌, కార్తీక్‌, మహిళా న్యాయవాదులు ఉమా మహేశ్వరి, సబిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని