మంచి నాయకుడు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు
ప్రజలకు సేవ చేసిన మంచి నాయకులు, మరణించినా ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
రాజోలి: ప్రజలకు సేవ చేసిన మంచి నాయకులు, మరణించినా ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇటీవల రాజోలి గ్రామంలో మరణించిన మాజీ సర్పంచి శ్రీరామ్ రెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన 55 మంది అభిమానులు రక్తం దానం చేయగా, వారికి పండ్లను అందించారు. నాయకత్వ పరంగా గొప్ప నాయకుడిని కోల్పోయామని, ఈ సందర్భంగా ఆయన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ మాజీ ఛైర్మన్ సీతారామిరెడ్డి, మాజీ సర్పంచి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!