logo

ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి

ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

Published : 30 Apr 2024 05:37 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే: ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ల్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే గ్రామస్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

 భాజపా, మిత్రపక్షాలను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, జాన్‌వెస్లీలు అన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారం చేపడితే బడుగు బలహీనవర్గాల రిజర్వేషన్లను తొలగిస్తారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు రమణ, మున్సిపల్‌ ఛైర్మన్‌ పుట్టపాకల మహేశ్‌, జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు, నాగర్‌కర్నూల్‌ జిల్లా కార్యదర్శి పర్వతాలు, జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని