దశాబ్దాల కల నెరవేరదేమి?
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది.
న్యూస్టుడే, నాగర్కర్నూల్
బిజినేపల్లి మండలం వట్టెంలో 1994లో ఏర్పాటైన నవోదయ విద్యాలయం
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లాలో బిజినేపల్లి మండలం వట్టెంలో 1994లో నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత ముప్పై ఏళ్లుగా కొత్త విద్యాలయాల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. ఉమ్మడి జిల్లాలో నవోదయ విద్యాలయం (వట్టెం), కేంద్రీయ విద్యాలయం ఒకటి (మహబూబ్నగర్) చొప్పున మాత్రమే ఉన్నాయి. నవోదయ విద్యాలయంలో 80 సీట్లు మాత్రమే ఉంటాయి. అందులో సీటు సంపాదించేందుకు ఏటా పది వేల మందికిపైగా విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తుంటారు. సీట్లు రాని వారంతా ప్రైవేట్ బడి లేదా హైదరాబాద్లో అధికంగా డబ్బులు వెచ్చించి కార్పొరేట్ సంస్థల్లో చేరాల్సి వస్తోంది. ఆర్థిక స్థోమత లేని వారు గ్రామీణా ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. కేంద్ర విద్యాలయాలు జిల్లాకొకటి చొప్పున ఏర్పాటైతే ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు వీటిపై హామీలు ఇస్తున్నా.. అమలు కావడం లేదు.
ప్రతిపాదనలకే పరిమితం.. : ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని కలెక్టర్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు పంపిస్తున్నా.. ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల నుంచి గతంలోనూ ప్రతిపాదనలు పంపించారు. నాగర్కర్నూల్లో ఈ విద్యాలయం ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలను పరిశీలించి కేటాయించారు. వరుసగా మూడేళ్లుగా ప్రతిపాదనలు వెళ్లినా.. విద్యాలయం మాత్రం మంజూరు కావడం లేదు. రెండేళ్ల క్రితం ఈ ఏడాది అద్దె భవనంలో ప్రారంభం కానుందని హడావుడి చేసినా.. ఉసూరనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే వీటిని సాధించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థులు అనేక హామీలు గుప్పిస్తున్నారు. కేంద్ర విద్యాలయాల సాధనకు స్పష్టమైన హామీనిస్తూ.. చిత్తశుద్ధితో పోరాడాలని ప్రజలు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మలొచ్చి.. అమ్ముతున్నాయ్..!
[ 17-05-2024]
ఒక్కటే రోజు మొత్తం 40కుపైగా రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు.. తెర వెనుక ఓ పార్టీ నేత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగిన ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. -
పశువైద్యంలో కొత్త పోకడలు
[ 17-05-2024]
తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా వ్యాధులు నయం చేసే హోమియో మందులను యూరోపియన్ దేశాల్లో వైద్యులు పశువైద్యంలోనూ వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పశువైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
అభిమాని రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం
[ 17-05-2024]
నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ అభిమాని తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని గీయించి అభిమానం చాటుకున్నారు. -
గద్వాల కేంద్రంగా.. రేషన్ బియ్యం దందా
[ 17-05-2024]
శాంతినగర్లో గత నెల 27వ తేదీ 114 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొయిలదిన్నెరోడ్డు పక్కన ఉన్న పిండిగిర్ని నడిపే ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
నల్లమలలో పెరిగిన ఓటింగ్
[ 17-05-2024]
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడికి మూడేళ్ల జైలు
[ 17-05-2024]
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత కథనం ప్రకారం.. -
అమ్మ కడుపు చల్లగా..
[ 17-05-2024]
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. అమ్మ కడుపు చల్లగా ఉండాలని అధికారులు సాధారణ ప్రసవాలకు చొరవ తీసుకుంటున్నారు. -
జూరాలకు కృష్ణా జలాలు
[ 17-05-2024]
జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం నుంచి 2,510 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో తీసుకోదని నీటినిల్వ 0.244 టీఎంసీల మేర ఉంది. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
[ 17-05-2024]
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని చెబుతూ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను తొలివిడత ప్రక్రియ ప్రారంభమైంది. -
2021లో మంజూరు.. పూర్తయ్యేదెన్నడో?
[ 17-05-2024]
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు.. మారుమూల గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ వాటిదశ మారకపోవడం విచారకరం. -
బాధ్యత మరచి.. కుటుంబానికి దూరమై
[ 17-05-2024]
ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రమాదాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వాహనదారులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. -
అయిజ విండో ఆదర్శం
[ 17-05-2024]
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఉమ్మడి జిల్లాలోని ఇతర విండోలు ఆదర్శంగా తీసుకోవాలని నాబార్డ్ ఉమ్మడి జిల్లా డీడీఎంలు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్