పదిలో బాలికలదే పైచేయి
జిల్లాలోని పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కలిపి మొత్తం 10,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం
నాగర్కర్నూల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద పదోతరగతి విద్యార్థినులు
కందనూలు, న్యూస్టుడే : జిల్లాలోని పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కలిపి మొత్తం 10,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 91.57 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయిలో 23వ స్థానం సాధించగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో బాలురు 5,205 మందికి గాను 4,695 మంది పాసయ్యారు. బాలికలు 5,302 మంది పరీక్షలు రాయగా 4,926 విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. 2022-23 విద్యా సంవత్సరంలో జిల్లాలో 10,545 మంది వార్షిక పరీక్షలకు హాజరు కాగా 9,582 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 90.87 శాతం నమోదైంది. దీంతో రాష్ట్ర స్థాయిలో 12వ స్థానం సాధించగా ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానం సాధించారు. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా, రాష్ట్ర స్థాయి జీపీఏల్లోనూ వెనుకబడిపోయారు. జిల్లాలోని ప్రభుత్వ విభాగ పరిధిలోని 10 పాఠశాలల్లో 16 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 42 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. జిల్లాలో మొత్తం 58 మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు.
కస్తూర్బా విద్యార్థినుల సత్తా.. : జిల్లాలో మొత్తం 20 కస్తూర్బా విద్యాలయాల పరిధిలో 780 మంది విద్యార్థినులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయగా 726 మంది ఉత్తీర్ణత సాధించారు. 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. అమ్రాబాద్, బల్మూరు, పదర, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, ఉప్పునుంతలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. చారకొండ కేజీబీవీలో ఇంగ్లిష్ మీడియంలో వరలక్ష్మి 9.7, ఊర్కొండ కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమం చదువుతున్న విజయలక్ష్మి 9.8 మార్కులు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదును చూసి ఆక్రమణలు
[ 22-05-2024]
నెల రోజులుగా అధికారులు, కింది స్థాయి సిబ్బంది మొత్తం లోక్సభ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల దృష్టి కూడా ఎన్నికలపైనే ఉంది. -
పాఠశాలల అభివృద్ధికి రూ.18.30 కోట్లు
[ 22-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. -
నల్లమలకు పర్యాటక శోభ
[ 22-05-2024]
నాగర్కర్నూల్ జిల్లా ‘అమ్రాబాద్ అభయారణ్యం’లో చేపడుతున్న అభివృద్ది పనులతో నల్లమల ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. -
మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్య
[ 22-05-2024]
చెట్టుకు ఉరేసుకొని వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గంధం చంద్రయ్య (70) మంగళవారం ఉదయం తన ఇంటి ముందున్న చెట్టుకు తలపాగాతో ఉరేసుకున్నాడు. -
పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య
[ 22-05-2024]
పదో తరగతిలో ప్రతిభను చాటిన విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. -
నకిలీ వెబ్సైట్తో మోసం
[ 22-05-2024]
నకిలీ వెబ్సైట్ సృష్టించి యాత్రికుల ప్రయాణ టికెట్ల బుకింగ్ పేరుతో సొమ్ము కాజేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
అంతర్రాష్ట్ర దొంగల పట్టివేత
[ 22-05-2024]
అంతర్ రాష్ట్ర దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డిలోని పట్టణ పోలీసుస్టేషన్లో ఎస్పీ సింధూశర్మ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
మూడేళ్లుగా చేరుకోని లక్ష్యం
[ 22-05-2024]
పాలమూరుకు వరదాయిని అయిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ)లో లక్ష్యం మేరకు నీటి ఎత్తిపోత కొనసాగడం లేదు. -
జాతీయ రహదారి.. సమకూరే దారేదీ?
[ 22-05-2024]
రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన రహదారులను నాలుగులేన్ల జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాలని గతంలో నిర్ణయించారు. అందుకు ప్రతిపాదనలు సైతం చేశారు. -
తల్లులకు కడుపుకోత!
[ 22-05-2024]
కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతూ నవమాసాలు మోసిన తల్లులకు కడుపు కోత మిగిలిస్తున్నారు. -
ఠాణాలకు ఠికాణా లేదు
[ 22-05-2024]
జిల్లాలతో పాటు మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాల్లో ప్రజలకు రక్షణ కల్పిస్తూ గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్స్టేషన్లకు సొంత భవనాలు కరవయ్యాయి. -
మన బడి పనులు పూర్తయ్యేనా?
[ 22-05-2024]
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో గత భారాస ప్రభుత్వం 2022 మార్చి 8న ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రారంభించింది. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 22-05-2024]
నేల స్వభావం, అందించే నీరును బట్టే విత్తనం మొలకెత్తడం, ఎదుగుదల ఉంటాయి. ఇందుకు కీలకమైన భూసార పరీక్షలు, నీటి పరీక్షలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. -
పీయూ ఇన్ఛార్జి ఉప కులపతిగా అహ్మద్ నదీం
[ 22-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) ఇన్ఛార్జి ఉప కులపతిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పురాల్లో కార్మికుల కొరత
[ 22-05-2024]
ఆరోగ్యంగా ఉండాలంటే మనచుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పురపాలికల్లో పారిశుద్ధ్య నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?
-
ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
-
ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు.. 748 కేంద్రాల్లో 91 శాతానికి పైగా నమోదు
-
అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు
-
తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్ కోర్టు తీర్పు