పేదల బతుకులు మార్చేందుకొచ్చా: ఆర్ఎస్
ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు.
తిమ్మాజిపేట రోడ్షోలో అభివాదం చేస్తున్న నాగర్కర్నూల్ భారాస అభ్యర్థి ప్రవీణ్కుమార్
తిమ్మాజిపేట, న్యూస్టుడే : ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం రాత్రి తిమ్మాజిపేటలో రోడ్డుషో నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఆస్తులు, అంతస్తులు అవసరం లేదని పేద బిడ్డలను విదేశాలకు పంపేందుకు కంకణం కట్టుకున్నానన్నారు. పేదబిడ్డలంతా నాకన్నా గొప్పగా బతకాలన్నదే తన ఆశయంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికలు అబద్దానికి, నిజానికి మద్య జరుగుతున్న భీకర యుద్ధంగా పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్ధన్రెడ్డి మాట్లాడుతూ మోస పూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. దీక్ష చేసైనా సరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. తిమ్మాజిపేట ప్రధాన రహదారిపై రోడ్డుషో చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీˆపీˆ రవీందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు ప్రదీప్, నాయకులు నాగం శశీదర్రెడ్డి, గోపిగౌడ్, స్వామి, అర్ధం రవి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు