గర్భంలోనే శిశువు మృతి
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.
వైద్యురాలి నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ
గద్వాల అర్బన్, న్యూస్టుడే: నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గట్టు మండలం బోయలగూడెం గ్రామానికి చెందిన సుజాత(26), వీరేష్ దంపతులకు ఇద్దరు ఆడ సంతానం. ప్రస్తుతం 9 నెలల గర్భిణి అయిన సుజాత ఆస్పత్రిలోనే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 1న జిల్లా ఆస్పత్రికి వెళ్లగా ప్రసవ సమయం ఇంకా ఉందని వైద్యులు చెప్పగా తిరిగి వెళ్లిపోయింది. సోమవారం పురిటినొప్పులు రావడంతో వారు గట్టు పీహెచ్సీకి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భంలో ఉన్న శిశువుకు రక్తప్రసరణ తక్కువగా ఉందని చెప్పడంతో వైద్యుల సలహా మేరకు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. అయితే గర్భంలోనే మగ శిశువు మృతిచెందాడు.
ఆపరేషన చేసి ఉంటే: వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన సమయానికి రాకపోవడంతో సిస్టర్లే వైద్యానికి ఉపక్రమించారని బంధువులు ఆరోపించారు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు పరీక్షించి సాధారణ కాన్పు చేశారని, అప్పటికే కడుపులోనే మగశిశవు మృతిచెందాడని, వెంటనే ఆపరేషన్ చేసి ఉంటే బతికేవాడన్నారు. చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.
రక్తప్రసరణ ఆగిపోవడంతో..: గర్భిణికి రక్తపోటు అధికం కావడంతో కడుపులో ఉన్న శిశువుకు రక్తప్రసరణ ఆగిపోవడంతోనేే మృతిచెందాడని జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు కిశోర్కుమార్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు చనిపోలేదన్నారు. ఏవైనా అనుమానం ఉంటే ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని వివరించారు. సంఘటన బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
దారుణంగా చూస్తున్నారు..: ఆసుపత్రికి వచ్చి రోగులను వైద్యులు కొందరు దారుణంగా చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణి కడుపులో శిశువు చనిపోయాడని తెలుసుకున్న ఆయన సోమవారం ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
వైద్యురాలికి తాఖీదు: శిశువు మృతి ఘటనపై వైద్యురాలికి తాఖీదు జారీచేసినట్టు పర్యవేక్షకుడు కిషోర్ చెప్పారు. ప్రసవం చేసే విషయంలో వైద్యురాలు పట్టించుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు రోజుల్లోగా ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా తాఖీదు జారీ చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్ రాష్ట్ర బండ లాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
[ 19-05-2024]
మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!