సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఓటర్లపై మండుటెండల ప్రభావం పడకుండా జాగ్రత్తలు
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
సమయం పొడిగింపు
పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలపై అధికారుల దృష్టి
- మహబూబ్నగర్ నియోజకవర్గం పరిధిలో 1,937, నాగర్కర్నూల్ పరిధిలో 2,067 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో కనీసం 20 శాతం కేంద్రాలను రిటర్నింగ్, సెక్టోరియల్ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడున్న కనీస సౌకర్యాలపై ఆరా తీశారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఆశా కార్యకర్తల ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉండాలి. ఈ శిబిరాల్లో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.
- ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలి. ప్రధానంగా క్యూలో నిలబడితే వారికి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి మంచినీటిని అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద ఎండలో నిలబడకుండా షామియానాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద గదుల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు ఉండేలా చూస్తున్నారు.
- కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వాలంటరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీళ్లు ప్రధానంగా వృద్ధులు, వికలాంగులకు అవసరమైన సేవలు అందించనున్నారు. ఎక్కవగా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న గదుల్లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈనాడు, మహబూబ్నగర్: పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎండల ప్రభావం ఓటింగ్ శాతంపై ఉంటుందన్న ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. రిటర్నింగ్ అధికారులు ఓటింగ్ శాతం తగ్గకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రిటర్నింగ్ అధికారులకు ఎండల ప్రభావం పోలింగ్పై పడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎండల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? పోలింగ్ రోజు ఏం చర్యలు తీసుకోవాలి? పోలింగ్ కేంద్రాల వద్ద వడదెబ్బ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది. సాధారణంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఎండల నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు.
సార్వత్రికంలో తగ్గుతున్న ఓటింగ్..: పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎన్నికలతో పోల్చుకుంటే ఎంపీ ఎన్నికలకు ఓటింగ్ శాతం తగ్గుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ స్థానాల పరిధిలో మొత్తం 80.52 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజవకర్గం పరిధిలో కేవలం 65.30 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. సుమారు 15.22 శాతం ఓటింగ్ తగ్గింది. నాగర్కర్నూలు స్థానం పరిధిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం పోలింగ్ నమోదు కాగా లోక్సభ ఎన్నికల్లో 62.51 శాతం ఓటింగ్ జరిగింది. ఈ స్థానం పరిధిలోని 13.16 శాతం ఓటింగ్ తగ్గింది. గతేడాది నవంబరు 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 79.89 శాతం, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 80.95 శాతం ఓటింగ్ నమోదయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి వివిధ కారణాలతో ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఈ ఏడాది ఎండ తీవ్రంగా ఉండటంతో గతంతో పోలిస్తే మరింత ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన మూడు విడత ఎన్నికల్లో ఎండల ప్రభావం ఓటింగ్పై పడటంతో ఈ నాలుగో విడతలో ఆ పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.
ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే..
పాలమూరులో వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. ముంబయి, ఫుణె, భీమండితోపాటు హైదరాబాద్లో నివాసం ఉంటారు. వీరంతా ఎన్నికల సమయంలో తమ గ్రామాలకు వచ్చి ఓటేసి వెళ్తారు. శాసనసభ సభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ స్థానిక నేతలు ఈ ఓటర్లపై దృష్టి సారిస్తారు. ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎండల్లో దూరప్రాంతాల నుంచి రావడం ఇబ్బందిగా మారుతుండటంతో వలస ఓటర్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పరిధిలోని జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో మాత్రమే 70 శాతం పోలింగ్ నమోదయ్యింది. మిగతా ఐదు నియోకవర్గాల్లో 60 శాతం లోపు ఉంది. నాగర్కర్నూల్ పరిధిలో కొల్లాపూర్లో 56.16 శాతం, అచ్చంపేటలో 58.92 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. ఈ ప్రాంతాల్లో ప్రతి గ్రామం నుంచి సుమారు 100-250 వరకు ఓటర్లు హైదరాబాద్లోని వివిధ పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఎండల్లో వీరంతా తిరిగి గ్రామాలకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లా అధికారులు మాట్లాడుతూ ఎండల ప్రభావం పడకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వీప్ కార్యక్రమంలో ఓటింగ్ శాతం పెరగడంపై దృష్టి సారించినట్లు వివరించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటింగ్కు వస్తే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్ రాష్ట్ర బండ లాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
[ 19-05-2024]
మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!